టాలీవుడ్ యంగ్టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ ప్రస్తుతం టాలీవుడ్లో మార్మోగిపోతోంది. ఇటు బిగ్బాస్ షోకు హోస్టర్గా వ్యవహరిస్తోన్న ఎన్టీఆర్ వెండితెర మీద టెంపర్ – నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ లాంటి మూడు హిట్లతో అక్కడ కూడా షేక్ చేస్తున్నాడు. ఈ మూడు సినిమాల తర్వాత ఎన్టీఆర్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ జై లవకుశ.
పవర్-సర్దార్ గబ్బర్సింగ్ సినిమాల దర్శకుడు కేఎస్.రవీంద్ర (బాబి) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ కెరీర్లోనే ఫస్ట్ టైం ఈ సినిమాలో మూడు క్యారెక్టర్లలో నటిస్తున్నాడు. జై క్యారెక్టర్ను రివీల్ చేస్తూ రిలీజ్ అయిన టీజర్ రికార్డుల మీద రికార్డులతో దూసుకుపోతోంది.
ఈ సినిమా స్టోరీ లైన్ ఇదే నంటూ ఓ లైన్ ఫిల్మ్నగర్ ఇన్నర్ సర్కిల్స్లో హల్చల్ చేస్తోంది. ఈ స్టోరీ లైన్ ప్రకారం వీరు ఇద్దరు కవల సోదరులు. ఎన్టీఆర్ తండ్రి మొదటి భార్యకు పుట్టిన వ్యక్తి జై అయితే, తన తండ్రి రెండో భార్యకు పుట్టిన వాళ్లే లవకుశ. జై పుట్టాక తల్లి చనిపోతుంది. ఆమె చావుకు కారణం తన తండ్రే అని భావించిన జై తన తండ్రితో పాటు తన తమ్మళ్లు లవ, కుశను చంపాలని పగతో రగిలిపోతూ ఉంటాడు.
చిన్నప్పటి నుంచే రౌడీగా మారిన జై పెద్ద గ్యాంగ్స్టర్గా మారిపోతాడు. లవ, కుశ మాత్రం తండ్రితోనే ఉంటాడు. వీరికి అటు గ్యాంగ్స్టర్ అయిన జై క్యారెక్టర్కు మధ్య జరిగే డ్రామానే జై లవకుశ సినిమాగా తెలుస్తోంది. ఈ సినిమా స్టోరీ వింటుంటేనే ఫ్యీజులు ఎగిరిపోయేలా ఉంది. మరి సినిమా చూస్తే ఇక అదిరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. దసరా సందర్భంగా ఈ సినిమాను సెప్టెంబర్ 21న రిలీజ్ చేస్తున్నారు.