టాలీవుడ్ యంగ్టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ‘జై లవకుశ’ షూటింగ్ చకచకా జరుగుతోంది. ఎన్టీఆర్ మూడు వరుస హిట్లతో ఉండడంతో జై లవ కుశకు బిజినెస్ పరంగా కూడా ఎన్టీఆర్ కేరీర్లోనే తిరుగులేని క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. ఎన్టీఆర్ చివరి సినిమా జనతా గ్యారేజ్ రూ.85 కోట్ల షేర్ రాబట్టి… ఎన్టీఆర్ కేరీర్లోనే తిరుగులేని బ్లాక్బస్టర్గా నిలిచింది.
ఈ నేపథ్యంలోనే జై లవ కుశ సినిమాకు రూ. 80 కోట్ల వరకు బిజినెస్ జరుతున్నట్టు ట్రేడ్వర్గాల ప్రాథమిక లెక్కల ప్రకారం జరుగుతోంది. ఈ క్రమంలోనే జై లవ కుశ శాటిలైట్ బిజినెస్కు క్లోజ్ అయినట్టు ఇండస్ట్రీలో ఇన్నర్ టాక్. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ జెమినీ జై లవ కుశ శాటిలైట్ రైట్స్ను రూ. 14 కోట్లకు సొంతం చేసుకుందట.
ఇది ఎన్టీఆర్ కేరీర్లోనే తిరుగులేని రికార్డుగా నిలిచింది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఆగస్టులో గుమ్మడికాయ కొట్టనుంది. ఇక ఎన్టీఆర్ చివరి సినిమా జనతా గ్యారేజ్ రిలీజ్ అయిన సెప్టెంబర్ 1నే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.