యువరత్న నందమూరి బాలకృష్ణ – పూరి జగన్నాథ్ కాంబోలో వస్తోన్న పైసా వసూల్ సినిమా రికార్డు స్థాయిలో షూటింగ్ కంప్లీట్ చేసుకుని సెప్టెంబర్ 1న రిలీజ్కు రెడీ అవుతోంది. సినిమాపై అంచనాలు ఎలా ఉన్నా, అనుకున్న టైం కంటే ముందే రిలీజ్కు రెడీ అవుతున్నా సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ విషయంలో నిర్మాతలకు షాక్ తప్పేలా లేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
బాలయ్య-పూరీలది క్రేజీ కాంబోనే… పైగా బాలయ్య శాతకర్ణి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు బాలయ్య కెరీర్లోనే భారీ వసూళ్లు సాధించింది. అయితే ఆ సినిమా క్రేజ్తో పైసా వసూల్ను పోల్చలేమని, క్రిష్ రేంజ్ వేరు, పూరీ రేంజ్ వేరని బయ్యర్లు ఈ సినిమాకు ఎక్కువ రేటు పెట్టడం లేదట.
నైజాం, సీడెడ్, ఓవర్సేస్ బిజినెస్ జరిగినా అనుకున్న రేటు పలకలేదట. ఇక ఆంధ్రాలో చాలా జిల్లాల్లో రేట్లు తెగడం లేదట. పూరీ సినిమాలు వరుసగా బకెట్ తన్నేయడంతో ఈ సినిమాకు భారీ రేట్లు ఇచ్చేందుకు బయ్యర్లు ఆసక్తిగా లేరని తెలుస్తోంది.
ఈ సినిమాకు రూ. 45 కోట్ల పైగా టోటల్ బిజినెస్ చేస్తే నిర్మాత టేబుల్ ప్రాఫిట్ లో ఉంటాడు. శాటిలైట్, ఆడియో హక్కులు 10 కోట్లు కలపుకుని ఇప్పటికి సుమారు 20 కోట్ల బిజినెస్ చేశారట. మరి రూ. 45 కోట్ల వస్తాయో ? లేదా ? అన్నది మాత్రం డౌటే అంటున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రియ శరణ్, ముస్కాన్, కైరా దత్ లు నటిస్తున్నారు.