ఏ రంగంలో అయినా సెంటిమెంట్లు నమ్మేవాళ్లు చాలా మందే ఉంటారు. మన టాలీవుడ్లో కూడా చాలా సెంటిమెంట్లు కంటిన్యూ అవుతుంటాయి. అగ్ర హీరో బాలకృష్ణకు ఈ సెంటిమెంట్ పట్టింపులు మరీ ఎక్కువ. ఆయన ఏ పని స్టార్ట్ చేయాన్నా, ముగించాలన్నా ముహూర్తాలు పెట్టించుకుంటారు.
ఇక బాలయ్య ఈ సెంటిమెంట్ పట్టింపుతో తన ఫ్యాన్స్కు షాక్ ఇచ్చాడు. బాలయ్య – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పైసా వసూల్. ఈ సినిమా శుక్రవారం వరల్డ్వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అవుతోంది. బాలయ్య సినిమా అంటే ముందురోజు రాత్రి నుంచే ఆ సినిమా రిలీజ్ అయ్యే థియేటర్ల వద్ద నానా హంగామా ఉంటుంది.
అర్ధరాత్రి నుంచే ప్రీమియర్ షోలు వేసేస్తారు. బాలయ్య సినిమాకు అర్ధరాత్రి ప్రీమియర్ షో లు వేసుకునేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదట. ఈ విషయమై బాలయ్య ఫ్యాన్స్కు, పోలీసులకు డిస్కర్షన్లు జరుగుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య వెంటనే స్పెషల్ షోలు, ప్రీమియర్ షోలు ఉండవు… ఉదయం 5 గంటల తర్వాతే ఏ షో అయినా అని ఖరాఖండీగా చెప్పేశారట. తమ అభిమాన హీరో బాలయ్యే స్వయంగా ఈ డెసిషన్ తీసుకోవడంతో బాలయ్య ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
తెలుగు జర్నలిస్ట్ లో రేపు ఉదయం 6 గంటలకే “పైసా వసూల్’ రివ్యూ సిద్ధంగా ఉండండి…