నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ పైసా వసూల్. శాతకర్ణి లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత బాలయ్య నటించిన సినిమా కావడం, పూరి జగన్నాథ్ డైరెక్టర్ కావడంతో ఈ సినిమాపై రిలీజ్కు ముందు మంచి అంచనాలు ఉన్నాయి. బాలయ్య సరసన శ్రియా శరణ్, ముస్కాన్ సేథీ, కైరా దత్ హీరోయిన్లుగా నటించారు.
శుక్రవారం ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా రూ. 9 కోట్ల షేర్ రాబట్టింది. ఇక రెండు రోజులకు కలిపి పైసా వసూల్ వరల్డ్ వైడ్గా రూ. 13 కోట్ల షేర్ రాబట్టింది. సినిమాకు మిక్స్ డ్ టాక్ రావడంతో రూ. 46 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఆ రేంజ్ వసూళ్లను ఎంత వరకు సాధిస్తుందా ? అన్నది చూడాలి. పైసా వసూల్ 2 డేస్ ఏరియా వైజ్ షేర్ ఇలా ఉంది…
నైజాం – 2.55 (రూ. కోట్లలో)
సీడెడ్ – 2.60
వైజాగ్ – 1.09
ఈస్ట్ – 0.88
వెస్ట్ – 0.76
కృష్ణా – 0.76
గుంటూరు – 1.77
నెల్లూరు- 0.51
—————————————
ఏపీ+తెలంగాణ = 10.92 కోట్లు
————————————–
వరల్డ్ వైడ్ టోటల్ 2 డేస్ షేర్ = 13 కోట్లు