మైండ్ బ్లాక్ చేస్తోన్న ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ సినిమా ప్రి రిలీజ్

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ – ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమా అంటేనే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఎలాంటి అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గ‌తంలో వీరి కాంబోలో వ‌చ్చిన జ‌ల్సా, అత్తారింటికి దారేది మంచి స‌క్సెస్ సాధించాయి. అత్తారింటికి దారేది సినిమా అయితే అప్పటి వ‌ర‌కు ఉన్న ఇండ‌స్ట్రీ రికార్డులు బీట్ చేసి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

ఇక తాజాగా వీరి కాంబోలో తెర‌కెక్కుతోన్న తాజా సినిమాపై అప్పుడే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమా హక్కుల ధరలు కూడా ఆకాశాన్నంటే స్థాయిలో ఉంటున్నాయి. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న టాక్ ప్ర‌కారం ఈ సినిమాకు అప్పుడే వివిధ ఏరియాల నుంచి భారీ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ‌ట‌.ఈ సినిమాకు నైజాంలో 32 కోట్లు, సీడెడ్‌లో 16-18 కోట్లు, మిగిలిన ఆంధ్రాప్రాంత‌మంతా 45 కోట్ల‌కు పైగా బిజినెస్ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ‌ట‌.

సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యేస‌రికి ఈ ప్రి రిలీజ్ బిజినెస్ ఏపీ+తెలంగాణ‌, ఓవ‌ర్సీస్‌, ఇండియాలోని ఇత‌ర ప్రాంతాలు క‌లుపుకుంటే రూ. 125 కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఏదేమైనా ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ మూవీ సంచ‌ల‌నాలు క్రియేట్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.