ప‌వ‌న్ మూవీ రిలీజ్ డిలే.. అందుకేనా?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. మాట‌ల మాంత్రికుడు, డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో శ‌ర‌వేగంగా రూపుదిద్దుకుంటున్న మూవీ.. ఇప్ప‌ట్లో లేన‌ట్టేన‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. చాలా స్పీడ్‌గా మూవీ మేకింగ్ ఉన్న‌ప్ప‌టికీ.. దీనిని రిలీజ్ చేసే టైంకి అనేక స‌మ్య‌లు వ‌స్తున్నాయ‌ని, అందుకే రిలీజ్ డేట్‌ని మారుస్తున్నార‌ని తెలుస్తోంది. నిజానికి ఈ మూవీని వ‌చ్చే సెప్టెంబ‌రులోనే రిలీజ్ చేయాలని ప‌క్కా ప్లాన్ వేసుకున్నారు.

దీని ప్ర‌కార‌మే.. షూటింగ్‌ను వేగంగా లాగించేస్తున్నారు. అయితే ఉన్న‌ట్టుండి ఈ రిలీజ్ డేట్ మారింద‌ని, వ‌చ్చ ఏడాది సంక్రాంతికి కానీ ప‌వ‌న్ మూవీ రిలీజ్ కాద‌ని టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ జై లవకుశ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో వస్తుందని టాక్ వినిపిస్తోంది. ఒకవెళ కాస్త ఆలస్యమైతే సెకెండ్ వీక్. ఇక మహేష్-మురుగదాస్ సినిమా సెప్టెంబర్ 27 కు ఫిక్సయింది. ఈ రెండూ కాక పూరి-బాలయ్యల సినిమా అదే నెల 29కి రెడీ అవుతోంది.

అంటే ఒకే నెలలో మూడు భారీ సినిమాలు వ‌స్తున్నాయి. ఇక్కడ మరో సమస్య ఏమిటంటే, అన్ని సినిమాలు కూడా 70 నుంచి 150 కోట్ల సినిమాలే. ఇంత అంటే నాలుగు సినిమాలు కలిసి దాదాపు 500 కోట్లు పూల్ చేయాలి. ఇది కాస్త సమస్య అవుతుందని భావిస్తున్నారు. అందుకే పవన్ సినిమాను సంక్రాంతికి మారిస్తే బాగుంటుంద‌నే ఆలోచ‌న వ‌చ్చింద‌ట‌. దీనిపై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం వెలువ‌డే అవ‌కాశం ఉంది.