పవర్స్టార్ పవన్కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమాపై టాలీవుడ్ సినీ అభిమానులు, ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పవన్కళ్యాణ్ 25వ సినిమా కావడంతో పాటు గతంలో త్రివిక్రమ్ – పవన్ కాంబోలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అందరూ లెక్కలు వేస్తున్నారు.
ఇక ఈ సినిమాకు అజ్ఞాతవాసి అనే టైటిల్ పరిశీలనలో ఉందని ఇప్పటి వరకు వార్తలు రాగా, ఇప్పుడు ఈ టైటిల్ దాదాపు ఖరారు చేసినట్టు ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. అజ్ఞాతవాసి టైటిల్ను హారిక బ్యానర్లో ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ కూడా చేయించారు. కీర్తి సురేష్ – అను ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిరుధ్ తొలిసారి పవన్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.
భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేస్తున్నట్టు ముందుగా ఎనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు సినిమా షూటింగ్ చాలా లేట్ అవుతుండడంతో జనవరి 10కి థియేటర్లలోకి రావడం గగనమే అంటున్నారు. పవన్ పాలిటిక్స్లో ఫుల్ బిజీగా ఉండడంతో అనుకున్న టైమ్కి, అనుకున్న షెడ్యూల్స్కు ఈ సినిమా షూటింగ్ జరగడం లేదని తెలుస్తోంది.
దీంతో ఇతర ఆర్టిస్టుల డేట్లు సర్దుబాటు కూడా కావడం లేదట. ఇక హీరోయిన్ కీర్తి సురేష్ డేట్లు చిత్రయూనిట్ అనుకున్న టైంకు సర్దుబాటు చేసుకోలేకపోవడంతో ఇప్పుడు ఆమె డేట్లు రావడం ఇబ్బందిగా మారిందట. ఏదేమైనా ఈ సినిమా జనవరి 10కి థియేటర్లలోకి వస్తే అది సంచలనమే అవుతుందని టాక్.