ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ మూవీ స్టోరీ లీక్‌..!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ – ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. అత్తారింటికి దారేది త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వస్తోన్న ఈ సినిమాపై ఇండ‌స్ట్రీలో భారీ అంచ‌నాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ద‌గ్గ‌ర నుంచి స్టోరీ దాకా అన్ని హాట్ న్యూస్‌లుగా నిలుస్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే ఈ సినిమా స్టోరీ లైన్ ఇదేనంటూ ఓ లైన్ సోష‌ల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా ఓ రివేంజ్ స్టోరీగా రాబోతుంద‌ట‌. త‌న తండ్రి మృతికి కార‌ణ‌మైన వారిమీద ప‌గ తీర్చుకోవ‌డ‌మే ఈ సినిమా క‌థ అట‌. ఈ సినిమాలో క‌థానుసారంగా ప‌వ‌న్ తండ్రికి ఇద్ద‌రు భార్య‌లు ఉంటార‌ట‌. వీరిలో ప‌వ‌న్ రెండో భార్య కొడుక‌ని టాక్‌.

రెండో భార్య కొడుకుగా ప‌వ‌న్ స‌మాజంలో అన్యాయానికి, కాస్త చీత్కారానికి గుర‌వుతాడ‌ట‌. చివ‌ర‌కు ఆ తండ్రితో పాటు పెద్ద భార్య కొడుకులు ఇబ్బందుల్లో ఉంటే ప‌వ‌న్ వాటిని ఎలా ప‌రిష్క‌రించి వారికి ద‌గ్గ‌ర‌య్యాడ‌న్న‌దే ఈ సినిమా స్టోరీ అన్న లైన్ ఇండ‌స్ట్రీలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

ఈ సినిమా త్రివిక్ర‌మ్ మార్క్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో తెర‌కెక్కుతోంద‌ట‌. సినిమాను ఏక‌ధాటిగా జ‌రిగే సింగిల్ షెడ్యూల్‌లో ఫినిష్ చేసి ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌ర్‌లో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ప‌వ‌న్ స‌ర‌స‌న కీర్తి సురేష్, అను ఇమాన్యుయెల్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై కె.రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు.