ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెర అరంగేట్రం చేసిన పూజా హెగ్డే ఆ తర్వాత మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ సరసన ముకుంద సినిమాలో కూడా నటించింది. ఈ రెండు సినిమాలు ప్లాప్ కావడంతో తర్వాత పూజా తెలుగు వైపు తొంగి చూడలేదు. బాలీవుడ్లో స్టార్ హీరో హృతిక్ రోషన్తో చేసిన ‘మొహంజదారో’ కూడా ఆమెను నిరాశపరిచింది.
చాలా లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో ఆమెకు బన్నీ సరసన డీజే సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు డీజే చూసిన వాళ్లందరూ పూజా గురించే మాట్లాడుకుంటున్నారు. సినిమాలో పూజ గ్లామర్కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోతే, యూత్ అయితే మళ్లీ మళ్లీ ఆమె అందాలు చూసేందుకే థియేటర్లకు క్యూ కడుతున్నారు.
సినిమా ఆసాంతం ఆమె అందాల ప్రదర్శన చేస్తూనే ఉంది. బికినీలో ఆమెను చూస్తోన్న యువత పిచ్చెక్కిపోతోంది. డీజే అందాల ఆరబోత ఎఫెక్ట్తో తెలుగులో ఆమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే పూజకు మహేష్బాబు – వంశీ పైడిపల్లి కాంబోలో వస్తోన్న సినిమాలో ఛాన్స్ వచ్చింది.
మహేష్ సినిమాలో ఛాన్స్ రావడంతో ఆమె వెంటనే తన రేటును రూ. 70 లక్షల నుంచి రూ.కోటికి పెంచేసిందట. దీంతో నిర్మాతలు కాస్త షాక్ అయినా ఆమెకు ప్రజెంట్ ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆ రేటు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట.