స్టైలీష్స్టార్ అల్లు అర్జున్కు ఇటీవల ఏ రేంజ్లో క్రేజ్ పెరుగుతుందో అదే రేంజ్లో కాంట్రవర్సీలతో వార్తల్లో ఉంటున్నాడు. గతేడాది సరైనోడు ప్రి – రిలీజ్ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడను బ్రదర్ అనడంతో బన్నీ పవన్ ఫ్యాన్స్కు ఓ రేంజ్లో టార్గెట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా బన్నీ పవన్ ఫ్యాన్స్తో ఢీ అంటే ఢీ అనే రీతిలో వ్యవహరించడంతో డీజే టీజర్ భారత్లోనే ఎక్కువ డిజ్లైక్లు వచ్చిన అత్యంత చెత్త టీజర్గా రికార్డు క్రియేట్ చేసింది.
ఇక బన్నీ తన లేటెస్ట్ మూవీ డీజే ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్లలో బన్నీ వ్యవహరించే తీరుతో టాలీవుడ్ మీడియా మొత్తం మనోడిపై ఓ రేంజ్లో గుర్రుగా ఉంది. డీజే ప్రమోషన్స్లో భాగంగా బన్నీ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ ఇంటర్వ్యూలో బన్నీతో పాటు దర్శకుడు హరీశ్ శంకర్, నిర్మాత దిల్ రాజు, బన్నీ పీఆర్వోలు, సినిమా పీఆర్వోలు నానా కండీషన్లు పెడుతున్నారట మీడియా వాళ్లకు.
ఇంటర్వ్యూ కేవలం 5 నిమిషాల్లో కంప్లీట్ చేయాలని, ఈ ఇంటర్వ్యూల్లో కేవలం తన సినిమా ‘డీజే’కు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడగాలని కోరుతున్నాడట. మిగిలిన విషయాలను గురించి ప్రశ్నించొద్దు అని ముందుగానే చెప్పేస్తున్నాడట. దీంతో డీజే సినిమా గురించి అందరూ ఒకే టైప్ ప్రశ్నలు అడుగుతారని..ఇక ఇంటర్వ్యూల్లో ఆసక్తి ఏం ఉంటుందని మీడియా వాళ్లు అసహనంతో ఉన్నారు.
ఒక వేళ ఎవరైనా మీడియా ప్రతినిధి అత్యుత్సాహంతో బయట ప్రశ్న వేస్తే పక్కనే ఉన్న వాళ్లు ఆ ప్రశ్న కట్ చేసేయండని చెపుతున్నారట. దీంతో మీడియాపై ఈ కంట్రోల్ ఏంటని తెలుగు మీడియా మొత్తం ఇప్పుడు బన్నీపై గుస్సాగా ఉంది.