కొత్త ఫైటింగ్‌: ఎన్టీఆర్ వ‌ర్సెస్ మోక్ష‌జ్ఞ‌

నంద‌మూరి వార‌సులైన యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, బాల‌య్య త‌న‌యుడు నంద‌మూరి మోక్ష‌జ్ఞ మ‌ధ్య కొత్త ఫైటింగ్‌కు తెర‌లేచింది. ఎన్టీఆర్ వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతూ అటు సంచ‌ల‌న విష‌యాల‌కు కేంద్ర బిందువుగా తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల్లో సుస్థిర‌స్థానం సంపాదించుకున్నాడు. బాల‌య్య త‌న‌యుడు ఇంకా వెండితెర‌మీద ఎంట్రీనే చేయ‌లేదు. మ‌రి వీరిద్ద‌రి మ‌ధ్య ఫైటింగ్ ఏంట‌న్న అంశం స‌హ‌జంగానే అంద‌రిలోను ఆస‌క్తి రేపుతుంది. వీరిద్ద‌రి మ‌ధ్య వార్‌కు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కార‌ణంగా క‌నిపిస్తున్నారు.

బాహుబ‌లి 2 విజ‌యాన్ని ఓ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి. ఈ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి ఏ ప్రాజెక్టు చేప‌ట్టినా అది క్రేజీ ప్రాజెక్టే అవుతుంది. రాజ‌మౌళి త‌న తాజా ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్‌తో సినిమ చేస్తాన‌ని చెప్పినా అది నెక్ట్స్ ప్రాజెక్టే అవుతుంద‌న్న‌ది మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు.

ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ‌, త్రివిక్ర‌మ్‌తో వ‌రుస క‌మిట్‌మెంట్లు పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే బాల‌య్య త‌న‌యుడు మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీని అదిరిపోయే రేంజ్‌లో తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. బాల‌య్య త‌న కొడుకును రాజ‌మౌళి చేతుల మీదుగా లాంచ్ చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. బాల‌య్య ఇప్ప‌టికే దీనిపై రాజ‌మౌళితో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు తెలుస్తోంది.

బాల‌య్య మాట రాజ‌మౌళి కాద‌న‌క‌పోవ‌చ్చు. బాల‌య్య రంగంలోకి దిగ‌డంతో రాజ‌మౌళి త‌న నెక్ట్స్ సినిమాను ఎన్టీఆర్‌తో చేస్తాడా ? లేదా మోక్షుతో చేస్తాడా ? అన్న‌దే స‌స్పెన్స్‌గా మారింది. ఏదేమైనా అటు ఎన్టీఆర్‌, ఇటు మోక్ష‌జ్ఞ మ‌ధ్య‌లో రాజ‌మౌళి ఉన్నారు. మ‌రి వీరిలో రాజ‌మౌళి ఎవ‌రిని త‌న నెక్ట్స్ సినిమా హీరోగా ఫిక్స్ చేస్తాడో చూడాలి.