బాహుబ‌లికి హాలీవుడ్ రేంజ్లో జ‌క్క‌న్న రెమ్యున‌రేష‌న్‌

తెలుగు మూవీ ప్ర‌తిభ‌ను ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్లిన మూవీ బాహుబ‌లి. ఈ మూవీ మొత్తం.. జ‌క్క‌న్న ప్ర‌తిభ‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నం. బాహుబ‌లి ది బిగినింగ్ సృష్టించిన ప్ర‌భంజ‌నంతో బాహుబ‌లి-2కి అడుగులు ప‌డ్డాయి. బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడు అనే ఒకే ఒక్క స‌స్పెన్స్‌తో సృష్టించిన బాహుబ‌లి-2 ఇప్పుడు ప్ర‌పంచ ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగిస్తోంది. క్లాస్ నుంచి మాస్ ప్రేక్ష‌కుల వ‌ర‌కు ఈ మూవీ కోసం క్యూక‌డుతున్నారు. శుక్ర‌వారం విడుద‌లైన ఈ మూవీ ఇప్ప‌టికే ప్రీమీయ‌ర్ షోలు, అడ్వాన్స్ బుకింగ్‌లు అన్నీ క‌లిపి కోట్లు కొల్ల‌గొట్టింది.

ప్ర‌స్తుతం వేస‌వి సెల‌వులు ప్రారంభం అవుతుండ‌డంతో ఈ క‌లెక్ష‌న్ల సునామీ మ‌రింత‌గా ముంచెత్తే అవ‌కాశం లేక‌పోలేద‌ని బాహుబ‌లి నిర్మాత‌లు ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నారు. ఇంత‌వ‌రకు బాగానే ఉన్నా.. ఇప్పుడు అంద‌రిలోనూ మ‌రో ప్ర‌శ్న త‌లెత్తుతోంది. దాదాపు ఐదేళ్ల‌కు పైగా మ‌రో ప్రాజెక్టు జోలికి పోకుండా బాహుబ‌లికే అంకిత‌మైన డైరెక్ట‌ర్ జ‌క్క‌న్న‌కు ఎంత పారితోషికం అందుతోంద‌న్న‌ది ప్ర‌తి ఒక్క‌రి సందేహం. నిజానికి బాహుబ‌లిపై తొలినాళ్ల‌లో ఇంత అంచ‌నాలు లేక‌పోయినా.. రానురాను అంచ‌నాలు కోట్ల‌ను దాటాయి.

దీంతో ఈ మూవీ కోసం నిర్మాత‌లు డ‌బ్బును ధార‌పోశారు. తాజాగా వ‌చ్చిన బాహుబ‌లి-2తో వారు వంద‌ల కోట్ల‌లోనే ఈ మూవీపై ఖ‌ర్చు చేశార‌ని తెలుస్తోంది. ఇక‌, జ‌క్క‌న్న కూడా దాదాపు 100 కోట్ల‌కు పైగానే రెమ్యున‌రేష‌న్ తీసుకున్న‌ట్టు టాక్‌. నిజానికి తెలుగు మూవీ ఇండస్ట్రీలో ఇంత స్థాయిలో పారితోషికం తీసుకున్న ద‌ర్శ‌కుడు ఇప్ప‌టి వ‌ర‌కు లేడు. కేవ‌లం హాలీవుడ్‌లోనే వంద‌ల కోట్ల‌లో రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు వంద కోట్ల‌కు పైగానే రెమ్మూన‌రేష‌న్ తీసుకుంటున్న జ‌క్క‌న్న.. హాలీవుడ్ రేంజ్‌కి ఎదిగిపోయాడ‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాలు అంటున్నారు. ఎంతైనా బాహుబ‌లి.. క‌ష్టం ఊరికే పోతుందా!!