రెండేళ్ల క్రితం వచ్చిన రాజు గారి గది చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఓంకార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మాంచి థ్రిల్లర్ మూవీగా నిలిచింది. ఇప్పుడు అదే ఓంకార్ దర్శకత్వంలో రాజు గారి గది 2 మూవీ తెరకెక్కింది. అయితే ఈ సీక్వెల్లో చాలా అదనపు హంగులు అద్దారు. టాలీవుడ్ మామాకోడళ్లు నాగార్జున, సమంత ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటించారు. ఇక సీరత్ కపూర్ అందాల ఆరబోత, వెన్నెల కిషోర్ లాంటి వాళ్లు కూడా సినిమాలో నటించడం, రిలీజ్కు ముందు ట్రైలర్లు, ప్రమోషన్లతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ రోజు రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ఇప్పటికే ఓవర్సీస్లో ప్రీమియర్లు కంప్లీట్ చేసుకుంది.
ప్రీమియర్ షో టాక్ ప్రకారం సినిమాకు పర్లేదన్న టాక్ నడుస్తోంది. సముద్రపు తీరంలోకి వెళ్లిన కొందరు స్నేహితులకు దెయ్యం ఉందన్న ఛాయలు కనపడతాయి. ఈ సందేహాలను నివృత్తి చేసే నిపుణుడి రోల్లో నాగార్జున నటించాడు. నాగ్ దెయ్యం కదలికలపై కన్నేసి ఉంచుతూ చేసే అనాలసిస్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇక దర్శకుడు హర్రర్ కామెడీ నేపథ్యంలో సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించాడు.
నాగ్ దెయ్యం ఆచూకి కనిపెటట్టేందుకు సమంత గురించి దర్యాప్తు చేసే సన్నివేశాలు బాగున్నాయి. ఓవరాల్గా దర్శకుడు సినిమాను స్లోగా నడిపించినా అసలు దెయ్యం ఎవరు ? సమంత వెనక దాగి ఉన్న అసలు కథ ఏంటన్న విషయాన్ని చాలా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ మందుకు నడిపించాడు. ఇక సెకండాఫ్లో సస్పెన్స్ రివీల్ అవుతుంది. ఇక క్లైమాక్స్ మాత్రం రొటీన్ రివేంజ్ డ్రామాగా తీసేశాడు.
అయితే సినిమాలో బాగా భయపడిపోయే హర్రర్, పొట్ట చెక్కలయ్యేలా నవ్వే కామెడీ అయితే లేదు. హర్రర్ + కామోడీ జానర్లోనే వచ్చిన రాజు గారి గది 2లో సమంత, నాగ్ పెర్పామెన్స్ సూపర్ అయితే ఓవరాల్గా సినిమా ఓకే మూవీగా నిలుస్తుంది. పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి తెలుగుజర్నలిస్టు.కామ్