టాలీవుడ్లో ప్రస్తుతం గోల్డెన్ గర్ల్ ఎవరంటే రకుల్ప్రీత్సింగ్ మాటే అందరి నోళ్లలో నానుతుంది. ఎన్టీఆర్, రాంచరణ్, మహేష్బాబు, అల్లు అర్జున్ ఇలా వరుసగా స్టార్ హీరోల సినిమాలు చేస్తోన్న ఆమె కోలీవుడ్లో సైతం అగ్రహీరోలతో ఆడిపాడుతోంది. ఇళ్లు ఉండగానే దీపం చక్కపెట్టుకోవాలన్న సామెతను బాగా వంటపట్టించుకున్న రకుల్ అప్పుడే రేటు పెంచేసింది. అమ్మడు రేటు పెంచడమే కాదు హాట్నెస్ కూడా పెంచేసింది.
అక్కడితో ఆగకుండా యాడ్స్, షాపింగ్ ఓపెనింగ్స్ అంటూ రెండు చేతులా సంపాదిస్తోంది. ఈ నేపథ్యంలో రకుల్కు హీరోయిన్గా స్టార్ స్టేటస్ రావడంతో ఆమెకు పలు బ్రాండ్లకు అంబాసిడర్గా ఉండాలంటూ ఆఫర్లు వెల్లువెత్తడంతో పాటు షాపుల ఓపెనింగ్ కార్యక్రమాలకు కూడా భారీగా ఆహ్వానాలు అందుతున్నాయి. తాజాగా టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లుగా ఉన్న తమన్నా, కాజల్ ప్రొడక్ట్లకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండేందుకు రూ. 60 లక్షల నుంచి కోటి వరకు డిమాండ్ చేస్తుంటే, రకుల్ మాత్రం 1.5 కోట్లకు తక్కువైతే గాని చేయనని ఖరాఖండీగా చెప్పేస్తోందట.
ఇక సినిమాల విషయానికి వస్తే తాజాగా మహేష్ పక్కన నటించిన స్పైడర్ సినిమా డిజాస్టర్ అయినా రకుల్ చేతిలో ఇప్పుడు ఆఫర్స్ బాగానే ఉన్నాయ్. కోలీవుడ్లో కార్తీతో ఓ సినిమా చేస్తోన్న ఆమెకు విశాల్ పక్కన కూడా ఓ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక బాలీవుడ్లో కూడా మరో సినిమా చేస్తోంది. ఇక మహేష్ – వంశీ పైడిపల్లి సినిమాలోను ఆమే హీరోయిన్గా ఎంపికైనట్టు తెలుస్తోంది.