చిరు ఉచ్చులో ప‌డ్డ చెర్రీ… స్టార్ డైరెక్ట‌ర్‌కు ఛాన్స్‌

లెజెండ్ సినిమా త‌ర్వాత బోయ‌పాటి శ్రీను మెగాస్టార్‌తో సినిమా చేసేందుకు చాలా ట్రై చేశాడు. స‌రైనోడు స్క్రిఫ్ట్ ప‌ట్టుకుని ప‌దే ప‌దే మెగా కౌంపౌండ్ చుట్టూ చ‌క్కెర్లు కొట్టాడు. మెగా కౌంపౌండ్ కూడా బోయపాటిని పెద్ద‌గా పట్టించుకోలేదు. ఎన్నో అష్ట‌క‌ష్టాలు ప‌డి చాలా కండీష‌న్ల మీద ఆ సినిమాను తీశాడు బోయపాటి. సినిమా రిలీజ్ అయ్యాక బ‌న్నీ కెరీర్‌లోనే తిరుగులేని బిగ్గెస్ట్ ఊర‌మాస్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమా చూశాక చిరుతో పాటు చెర్రీ ఇద్ద‌రూ కూడా షాక్ అయ్యార‌ట‌. అర్ర‌రే మ‌నం మంచి ఛాన్స్ వ‌దులుకున్నాం అని ఫీల్ కూడా అయ్యార‌న్న‌ది అప్ప‌టి టాక్‌.

ఖైదీ నెంబ‌ర్ 150 త‌ర్వాత చిరు వెంట‌నే బోయ‌పాటితో సినిమా చేయాల‌నుకున్నాడు. అయితే ధృవ టాలెంట్ చూసి సురేంద‌ర్‌రెడ్డికి ఫిక్స‌య్యాడు. ఇక స‌రైనోడు త‌ర్వాత బోయ‌పాటి తీసిన జ‌య జాన‌కి నాయ‌క సూప‌ర్ హిట్ కింద లెక్కే. ఆ సినిమా బ‌డ్జెట్‌కు త‌గ్గ వ‌సూళ్లు రాక‌పోయినా రూ.30 కోట్లు వ‌చ్చాయంటే అది కేవ‌లం బోయ‌పాటిని చూసే అన్న‌దాంట్లో డౌటే లేదు. బెల్లంకొండ శ్రీనును పెట్టి అలాంటి బ‌ల‌మైన క‌థ‌తో బోయ‌పాటి ఇలాంటి మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ తీసి మెప్పించ‌డ మామూలు విష‌యం కాదు.

ఈ సినిమా త‌ర్వాత బోయ‌పాటి చిరును క‌లిసి ఓ క‌థ చెప్పాడ‌ట‌. అయితే చిరు సైరాకు ఫిక్స్ అవ్వ‌డంతో మ‌నోడు చెర్రీకి ఓ క‌థ చెప్ప‌డం, ఆ క‌థ చెర్రీకి పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చేయ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. వెంట‌నే బోయ‌పాటితో సినిమాకు చెర్రీ ఫిక్స‌యిపోయాడ‌ట‌. వాస్త‌వంగా ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మిస్తుంద‌ని అనుకున్నారు. గీతాతో బోయ‌పాటికి క‌మిట్‌మెట్ ఉంది. అయితే చెర్రీ త‌న నెక్ట్స్ సినిమాను మ‌రో నిర్మాత‌కు క‌మిట్ అవ్వ‌డంతో ఇప్పుడు ఆ బ్యాన‌ర్‌లో వీరిద్ద‌రి కాంబోలో సినిమా సెట్స్‌మీద‌కు వెళ్ల‌నుంది. ఏదేమైనా లెజెండ్‌, జ‌య జాన‌కీ త‌ర్వాత బోయ‌పాటి నంద‌మూరి కౌంపౌండ్‌లోకి ఎంట‌ర్ అవుతాడ‌నుకుంటే చిరుకు గాలం వేసి చివ‌ర‌కు చెర్రీని ప‌ట్టేసి అలా మెగా కాంపౌండ్‌లో చేరిపోయాడు.