దర్శకధీరుడు రాజమౌళి క్రియేట్ చేసిన విజువల్ వండర్ బాహుబలి సినిమా వరల్డ్ వైడ్గా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించేసి ప్రపంచానికి చాటాయి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ను డ్రగ్ మాఫియా పట్టి పీడిస్తోంది.
టాలీవుడ్లో పలువురు ప్రముఖులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ నేతృత్వంలో విచారిస్తున్నారు. ఈ ఇష్యూపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో సెటైర్లు వేశాడు. తెలంగాణ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకన్ సబర్వాల్ను వర్మ టార్గెట్ చేశాడు. అకుల్ను మీడియా హీరోగా చూపిస్తోందంటూ తన అసహనం వ్యక్తం చేశాడు.
బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలిలో అకున్ను మీడియా ప్రొజెక్ట్ చేస్తోందంటూ వర్మ ట్విట్టర్ వేదికగా కామెంట్లు వదిలాడు. ఈ సారి రాజమౌళి బాహుబలి 3 సినిమా చేస్తే అకున్ సబర్వాల్ నే హీరోగా పెట్టాలని వెటకారంగా కామెంట్ చేశాడు. ఇక పోలీస్ శాఖను కూడా వర్మ వదల్లేదు.
పోలీసులు తమ ప్రతాపాన్ని చూపించేందుకు ఇండస్ట్రీని ఓ టీజర్గా వాడుకుంటున్నాడని విసుర్లు విసిరాడు. డ్రగ్స్ ఇష్యూపై ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న వర్మ ఇప్పుడు ఇలా సెటైర్లు వేయడం చూస్తుంటే ఈ ఇష్యూపై ఇంకెన్ని సెటైర్లు వేస్తాడో ? అన్నది చూడాలి.