టాలీవుడ్ను నెల రోజుల క్రిందటి వరకు డ్రగ్స్ కేసు ఓ ఊపు ఊపింది. డ్రగ్స్ కేసులో తెలంగాణ పోలీసులు సిట్ ఏర్పాటు చేసి టాలీవుడ్కు చెందిన 12 మంది సెలబ్రిటీలను రోజుకు ఒకరు చొప్పున విచారించడం పెద్ద కలకలం రేపింది. హీరో రవితేజ, నవదీప్, ముమైత్ ఖాన్, నందూ, సుబ్బరాజు, ఛార్మి.. ఇలా సుమారు 12 మందిని డ్రగ్స్ కేసులో విచారించారు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ షేకైపోయింది. సిట్ రెండో లిస్టు కూడా ఉందన్న టాక్ రావడంతో టాలీవుడ్లో ఒక్కసారిగా తీవ్ర ఆందోళన చెలరేగింది.
ఇక డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న రవితేజ ఇప్పుడు గంజాయి కేసులో చిక్కుకున్నాడా ? అంటే అవుననే ఆన్సర్లే కర్ణాటక నుంచి వస్తున్నాయి. కర్ణాటకలో ఓ కారు యాక్సిడెంట్లో గంజాయి దొరకడంతో ఇప్పుడు ఇక్కడ టాలీవుడ్ డొంక కదిలింది. మూడు రోజుల క్రితం టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు మనవడు గీతా విష్ణు బెంగళూరులో ఓ యాక్సిడెంట్ చేశాడు.
వెంటనే ఆ స్పాట్కు పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మారిపోయింది. ఆ కారులో భారీ ఎత్తున గంజాయిని పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఆదికేశవులు నాయుడు మనవడు గీతావిష్ణును విచారించడంతో అతడు చెప్పిన విషయాలు విని పోలీసులు ఖంగుతిన్నారు. తనకు హీరో రవితేజ గంజాయి సరఫరా చేస్తాడని పోలీసులకు అతడు స్టేట్మెంట్ ఇచ్చినట్టు షాకింగ్ వార్త ఒకటి బయటకు వచ్చింది.
తనకు గతంలో రవితేజ చాలాసార్లు గంజాయి సరఫరా చేసేవాడని కూడా అతడు చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రవితేజ పేరు ఇప్పుడు స్మగ్లింగ్లో కూడా బయటకు రావడంతో టాలీవుడ్లో మళ్లీ కలకలం రేగింది. మరి ఇప్పుడు కర్ణాటక పోలీసులు రవితేజకు నోటీసులు జారీ చేసి విచారిస్తారా ? లేదా ఈ కేసు ఎలా మలుపులు తిరుగుతుందో ? చూడాలి.