బాహుబలి సీరిస్ విజయాలతో ప్రభాస్ ఇప్పుడు నేషనల్ స్టార్ అయిపోయాడు. ప్రభాస్ సినిమా వస్తుందంటే ఇప్పుడు కేవలం తెలుగులోనే కాదు ఇండియన్ సినిమా జనాలంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేస్తోన్న సినిమా సాహో. తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా రూ.150 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది.
ఈ సినిమాకు నేషనల్ లుక్ తీసుకువచ్చేందుకు గాను బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధకపూర్ను హీరోయిన్గా ఎంపిక చేశారు. ఆమెను తీసుకునేందుకు ఏకంగా రూ. 4 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్టు కూడా టాక్. ఇప్పటికే శ్రద్ధా ప్రభాస్ సరసన సెట్లో జాయిన్ అయ్యింది కూడా. రన్ రాజా రన్ ఫేం సుజీత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో శ్రద్ధా రోల్ గురించి ఆసక్తికర వార్తలు ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి.
సాహోలో శ్రద్ద డ్యూయెల్ రోల్లో కనిపించనుందట. ప్రభాస్ కు హీరోయిన్ గా ఓ పాత్రలో కనిపిస్తే, మరో పాత్రలో నెగిటివ్ రోల్లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ నెగిటివ్ రోల్ ప్రభాస్ను చంపే టార్గెట్తో అతడికి దగ్గరై ప్రేమలోకి దింపే ప్రయత్నాలు చేస్తుందట. ఇంటర్నేషనల్ స్టోరీ నేపథ్యంతో సాహో ఉంటుందని సమాచారం. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.