సూపర్ స్టార్ మహేష్ బాబు – క్రేజీ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ కాంబోలో తెరకెక్కితోన్న భారీ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ స్పైడర్. రూ. 100 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. సౌత్ ఇండియాలో ఈ యేడాది అత్యంత క్రేజ్ ఉన్న సినిమాల్లో స్పైడర్ ఒకటి.
సినిమాపై ఉన్న భారీ అంచనాలతో స్పైడర్ ప్రి రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయే రేంజ్లో జరుగుతోంది. ఇప్పటికే చాలా ఏరియాల్లో రికార్డ్ ధరకు అమ్ముడవుతోన్న స్పైడర్ తమిళ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. కళ్లు చెదిరే రేటుకు స్పైడర్ తమిళ్ రైట్స్ సేల్ అయ్యాయి.
ప్రముఖ నిర్మాణ సంస్థ, రోబో 2.0 చిత్రాల్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ కంపెనీ ఈ హక్కుల్ని సుమారు రూ.23 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిందట. స్పైడర్ కోలీవుడ్ రైట్స్ లైకాకు దక్కడంతో ఆ సినిమాకు భారీ రిలీజ్, ప్రమోషన్లతో పాటు మంచి ఓపెనింగ్స్ దక్కనున్నాయి.
ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని సెప్టెంబర్ 27న దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు. మహేష్బాబు సరసన రకుల్ప్రీత్సింగ్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాకు హరీష్ జైరాజ్ స్వరాలందించనున్నారు.