తెలుగు సిల్వర్ స్క్రీన్పై ప్రారంభమైన బాహుబలి ప్రయాణం.. ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తోంది! బాహుబలి-1 దిబిగినింగ్..తో మొదలైన మూవీ ఫీవర్ బాహుబలి-2 ది కంక్లూజన్తో కొనసాగుతోంది. బాలీవుడ్ రికార్డులను సైతం తిరగరాస్తున్న ఈ మూవీపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూనే ఉన్నాయి. క్షణం కూడా తీరిక లేని ములాయం సింగ్ లాంటి నేతలు సైతం ప్రత్యేకంగా మూవీని చూసి సంబరపడిపోయారు. ఇక, ఏపీ సీఎం చంద్రబాబు కూడా మూవీ ని చూసి మెచ్చుకున్నారు.
నిజానికి వారం మించి ఏ సినిమానూ చూడని చైనా ప్రేక్షకులు కూడా రెండు వారాలుగా బాహుబలి కోసం క్యూ కడుతూనే ఉన్నారంటే ఆశ్చర్యం అనిపించకమానదు. ఇదంతా ఓ టాపిక్ అయితే, బాహుబలి మూవీ ఇంతటితో పూర్తయిపోయినట్టేనా? ఇంకా ఏమైనా ఉందా? అనేది ప్రస్తుతం అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. ఇప్పటికైతే కంక్లూజన్ చెప్పేశాం కాబట్టి.. ఏమీ లేదు.. అని ఎవరైనా చెప్పినా.. నమ్మలేని పరిస్థితిలో ప్రేక్షుకులు ఉండడం గమనార్హం.
మళ్లీ ఇదే సీక్వెల్గా బాహుబలి-3 వస్తే బాగుంటుందనే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది. దీనికి అనుగుణంగానే మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. ఇదే విషయంలో ఇటీవల ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన బాహుబలి నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ.. కంక్లూజన్ ఇచ్చేశాం కాబట్టి ఇంక బంద్ అయినట్టే అని చెబుతూనే.. కథ దొరికితే.. బాహుబలి-3 తీసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడం ఆశలు చిగురించేలా చేసింది.
మొత్తానికి బాహుబలి-2 కంక్లూజన్.. ఇప్పటితో ఆగేలా లేదనేది స్పష్టమైపోయింది. సో.. బాహుబలి-3 త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదోమో?! చూద్దాం.. !! జక్కన్న ఏం చేస్తాడో!