ప‌న్నీర్‌పై అత్త‌రు జ‌ల్లుతున్న అన్నాడీఎంకే

మొన్న‌టి వ‌ర‌కూ గ్రూపులుగా విడిపోయిన అన్నాడీఎంకే నేత‌లు.. ఇప్పుడు ఐక్య‌తారాగం మొద‌లుపెట్టారు. అంద‌రం క‌లిసికట్టుగా డీఎంకే పోరాడ‌దామ‌ని పిలుపునిస్తున్నారు. ముఖ్యంగా తిరుగుబాటు నేత పన్నీర్ సెల్వాన్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. శత్రువుల‌తో మితృత్వం వ‌ద్ద‌ని.. అంతా క‌లిసి ఐక్యంగా డీఎంకేపై పోరాడదామ‌ని స్నేహ హ‌స్తం అందిస్తున్నారు. ఎమ్మెల్యేల మెజారిటీ ద‌క్క‌క‌పోయినా.. ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు మాత్రం ప‌న్నీర్ సెల్వానికే ఉంద‌ని గ్ర‌హించిన నేత‌లు.. ఇప్పుడు ఆక‌ర్షించే ప‌నిలో ప‌డ్డారు. ఆయ‌న పార్టీ పెడ‌తార‌ని ఊహాగానాలు వ‌స్తున్న నేప‌థ్యంలో స‌రికొత్త వ్యూహానికి […]