నంద్యాల టీడీపీ క్యాండెట్ ఖ‌రారు..!

ఏపీలో మ‌రో ఉప ఎన్నిక‌కు ర‌స‌వ‌త్త‌ర పోరు ఖాయంగా క‌నిపిస్తోంది. 2014లో సాధార‌ణ ఎన్నిక‌ల త‌ర్వాత మూడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఉప ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఎన్నిక‌ల టైంలోనే మృతిచెందిన శోభా నాగిరెడ్డి స్థానంలో ఆమె కుమార్తె అఖిల‌ప్రియ ఏక‌గ్రీవంగా గెల‌వ‌గా, కృష్ణా జిల్లా నందిగామ‌లో మృతిచెందిన తంగిరాల ప్ర‌భాక‌ర్‌రావు కుమార్తె సౌమ్య విజ‌యం సాధించారు. ఇక తిరుప‌తిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మున్నూరు వెంక‌ట‌ర‌మ‌ణ మృతి చెందగా అక్క‌డ జ‌రిగిన ఉప ఎన్నిక‌లో ఆయ‌న భార్య సుగుణ‌మ్మ ల‌క్ష […]