చంద్రబాబు చైనా నుంచి ఏం తీసుకొస్తారు?

రాజధాని నిర్మాణమంటే ఏ నాయకుడికైనా కత్తి మీద సాము లాంటిది. నాయకుడిలోని నాయకత్వ లక్షణాల్ని సవాళ్ళే బయటపెడతాయి. సంక్షోభాల్ని అవకాశాలుగా మలచుకోవడం నాయకుల లక్షణం. ఓ రాజధానిని నిర్మించవలసి వస్తుందని తెలుగు రాజకీయాల్లో ఏ నాయకుడూ అనుకుని ఉండడు. హైదరాబాద్‌ని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు పాత్ర అద్వితీయం. అంతకు ముందు, ఆ తరువాత కూడా ముఖ్యమంత్రులుగా పనిచేసినవారు హైదరాబాద్‌ అభివృద్ధి కోసం పనిచేశారు. రాజధాని అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అయితే కొత్త రాష్ట్రానికి రాజధాని […]

చైనా స్టీల్ అమరావతికి వచ్చేస్తోంది!

ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు చైనా ప్రభుత్వ రంగ సంస్థ ముందుకొచ్చింది. చైనా ప్రభుత్వరంగంలోని అతిపెద్ద ఉక్కు కంపెనీ అన్‌స్టీల్‌ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జరిపిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. 3 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేశారు. చైనా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమైనారు. ఆన్‌స్టీల్‌ కంపెనీతో జరిగిన సమావేశంలో నూతనంగా నిర్మిస్తున్న […]

సింగ’పూర్‌’ లో మనకి మిగిలేది పూరే నా?

సింగపూర్‌ చాలా చాలా అభివృద్ధి చెందింది. ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొని అభివృద్ధి బాట పట్టిన సింగపూర్‌ని చూసి ప్రపంచం గర్వపడుతుంది. ఆ సింగపూర్‌ని చూసి నేర్చుకోవాలంటూ వివిధ దేశాల ప్రముఖులు చెబుతారు. ఆ సింగపూర్‌ని మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సృష్టించాలని కలలుకంటున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడో ముఖ్యమైన అంశం ఉంది. సింగపూర్‌కి, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణ బాద్యతలు అప్పగించడం తప్పు కాదు. కానీ సింగపూర్‌ ప్రభుత్వం వేరు, అక్కడి కంపెనీలు వేరు. ఏ […]

చలో అమరావతి-అన్నీ కన్నీటి గాధలే

ఊద్యోగుల తరలింపు ప్రక్రియ భావోద్వేగాల మధ్య ప్రారంభం అయింది. ఎన్నో ఎళ్లుగా హైదరాబాద్ లో స్థిరపడిన ఊద్యొగులు అమరావతికి వెళ్లాల్సి రావడంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ జీవన శైలిలో భాగమైన ఏపి ఉద్యోగులు, అకస్మాత్తుగా తమ కుటుంబ సభ్యులు, బందువులను వదిలి అమరావతికి వెళ్లాల్సి రావడంతో తమ సొంత రాష్ట్రానికి వెళుతున్నామన్న సంతోషం కన్నా ఇన్నేళ్లుగా కలిసి ఊన్న మహనగరాన్ని వదిలి వెళ్తున్నామన్న వేదన వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. తరలింపు డెడ్ […]

సింగపూర్ సంస్థకు అమరావతి ఛాన్స్

కొత్త రాజధాని అమరావతి అభివృద్ధి అవకాశాన్ని సింగపూర్‌ కన్సార్టియంకు ఇవ్వాలని ప్రభుత్వం దాదాపుగా ఖరారు చేసింది. ముందుగా అనుకున్నట్లుగానే సింగపూర్‌ సంస్థకు 58 శాతం ఈక్విటీని ఖరారు చేశారు. ఈ పెట్టుబడికి అదే స్థాయిలో ఆదాయాన్ని కూడా సమకోర్చాలని నిర్ణయిరచారు. సింగపూర్‌ సంస్థకే స్విస్‌ ఛాలెంజ్‌ ద్వారా రాజధాని నిర్మాణ బాధ్యత అప్పగించేందుకు దాదాపు నిర్ణయించిన నేపథ్యంలో ఆ సంస్థకు కల్పించాల్సిన ప్రయోజనాలపైనా అధికారులు విస్తృతంగా కసరత్తు చేశారు. గత నాలుగు రోజులుగా ఇదే అంశాలపై ఉన్నతాధికారులు […]

తడిచి మోపెడు అవుతున్న ఉద్యోగుల తరలింపుఖర్చు

ఉద్యోగుల తరలింపుఖర్చు ప్రభుత్వానికి తడిసి మోపెడు కానుంది. సచివాలయంలో మంత్రులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శుల కార్యాలయాలకు మాత్రమే సదుపాయాలు కల్పిస్తున్నారు. అదీ ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు సాధ్యపడేలాలేదు. కాగా హెచ్‌ఓడిలకు సంబంధించి మీ కార్యాలయాలను మీరే వెతుక్కోండని ప్రభుత్వం తెగేసి చెప్పడంతో రెట్టింపు అద్దెలతో లీజుల పందేరానికి తెరలేచినట్లు విశ్వసనీయ సమాచారం. కొందరు దళారులు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలియవచ్చింది. తరలింపు ప్రక్రియ ప్రారంభం కాకమునుపే పరిస్థితి ఇలా ఉంటే మూడేళ్లపాటు ప్రైవేటు భవనాలకు లీజులు […]

వాయిదా పడ్డ అమరావతి ప్లాట్ల కేటాయింపు

ఏపీ రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపుకు ప్రభుత్వం సోమవారం ముహూర్తం పెట్టింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్లాట్ల కేటాయింపు తాత్కాలికంగా వాయిదా వేశారు. దీంతో రైతులు కొంత నిరాశకు గురయ్యారు. అమరావతి నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పొలాలను త్యాగం చేసిన రైతులకు నేడు ప్లాట్లు కేటాయిస్తామని, డ్రా ద్వారా ఎవరికి ఎక్కడ ప్లాట్ ఇస్తున్నదీ ప్రకటిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే, తుళ్లూరు ప్రాంతంలో నిన్న సాయంత్రం నుంచి […]

బడ్జెట్ లో లోటు దుబార లో గ్రేటు….

హైదరాబాద్‌ నుంచి అమరావతికి ప్రభుత్వ కార్యాలయాల హడావుడి తరలింపు వలన రూ.వందల కోట్లు దుబారా అవుతుండగా, ఈ దుబారా ఖర్చులోనూ చేతివాటం మెండుగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయ అద్దెలు, లీజుల వ్యవహారంలో రూ.కోట్లల్లో అక్రమ పద్దతుల్లో కొంత మంది జేబులు నింపుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. కార్యాలయాల అద్దెలు, లీజులకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శ కాల్లోనే వాటంగా స్కాం చేయడానికి వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తోంది. పైసా ఖర్చు లేకుండా కొన్ని లక్షల చదరపు అడుగుల సర్కారీ […]

నారాయణా చాలించు నీ అమరావతి లీలలు.

అంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో సమీకరణలో భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపుపై ఆరు నెలలుగా అదిగో.. ఇదిగో.. అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారు. రాజధాని శంకుస్థాపన పూర్తయిన వెంటనే గత డిసెంబరు 31 నుంచి ప్లాట్ల కేటాయింపు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. అప్పట్నించి ఇప్పటవరకూ వాయిదాల పరంపర కొనసాగుతోంది. తరువాత జనవరి 31 నుంచి అని ఒకసారి, మార్చి 31 నుంచి అని మరోసారి, మే 31 నుంచి అంటూ ఇంకోసారి ప్రకటించారు. చివరిగా ఈనెల 10 […]