ప‌వ‌న్ ట‌ర్న్ ఎలా ఉంటుంది… ఒక్క‌టే టెన్ష‌న్‌గా అక్క‌డ‌…!

మూడు రోజులపాటు ఉత్త‌రాంధ్ర‌లో ప‌ర్య‌టించేందుకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ రెడీ అయ్యారు. నిజానికి ఆయ‌న విశాఖ‌కు రావ‌డం.. చాలా కాల‌మే అయిపోయింది. ఇప్పుడు అనూహ్యంగా వైసీపీ నేత‌లు.. `విశాఖ గ‌ర్జ‌న‌` చేస్తున్న స‌మ‌యంలో ప‌వ‌న్‌.. ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న పెట్టుకోవ‌డం.. రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత రించుకుంది. అంతేకాదు.. దీనివ‌ల్ల ప‌వ‌న్ ఏం చెప్ప‌నున్నార‌నేది కూడా ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం మూ డు రాజ‌ధానుల డిమాండ్‌ను ఉద్య‌మంగా ముందుకు తీసుకువెళ్లాల‌ని వైసీపీ నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ విశాఖ‌లో ప‌ర్య‌ట‌న‌కు […]

వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల‌పై కేసులు.. ఆ జీవో కాల్ బ్యాక్‌..!

“మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చిందిలే.. ఇక‌, మ‌న ఇష్టం.. అడిగేవారు ఎవ‌రు? “ అనుకున్న వైసీపీ నాయ‌కుల‌కు, మంత్రుల‌కు భారీ షాక్ త‌గిలింది. ఎందుకంటే.. గ‌తంలో వీరిపై న‌మోదైన కేసుల‌కు సంబంధించి.. ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం తీవ్ర నిర్ణ‌య‌మే తీసుకుంది. వైసీపీ ప్ర‌బుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ముందు కూడా.. అనేక సంద‌ర్భాల్లో వైసీపీ నేత‌ల‌పై పోలీసులు కేసులు న‌మోదు చేశారు. అయితే.. వీటిని విచారించాల్సిన వైసీపీ ప్ర‌భుత్వం.. ఎలాంటి విచార‌ణ‌లు లేకుండా.. మూసేసే ప్ర‌య‌త్నం చేసింది. దీనికి సంబంధించి […]

వైసీపీకి షాక్ ఇచ్చేలా గేమ్ ఆడిన బాబు…!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వంటి వ్యూహాత్మ‌క నాయ‌కుడు ఉండ‌ర‌ని అంటారు. ఎక్క‌డ త‌గ్గాలో.. ఎక్క‌డ నెగ్గాలో తెలిసిన నాయ‌కుడిగా ఆయ‌న‌కు పేరుంది. ఇప్పుడు కూడా.. అదే త‌ర‌హాలో చంద్ర‌బాబు వ్య‌వ‌హ రించారు. గ‌త కొన్ని రోజులుగా.. ఒక కీల‌క విషయంపై వైసీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఎన్టీఆర్ యూనివ‌ర్సిటీకి.. పేరు మార్చారు. ఈ స‌మ‌యంలో టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళ‌న చేసింది. ఆయ‌న‌పేరు మార్చేందుకు వీల్లేద‌ని కూడా స్ప‌ష్టం చేసింది. అయితే.. దీనిపై వైసీపీ చిత్రంగా స్పందించింది. […]

కేసీఆర్ రావొచ్చు.. కానీ.. ఏపీకి ఏం చెబుతారు..?

భార‌త రాష్ట్ర‌స‌మితి అధినేత.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. వ‌చ్చే నెల‌లో ఏపీలో అడుగు పెట్ట‌ను న్నారు. 2019లో తొలిసారి ఏపీ గ‌డ్డ‌పై అడుగు పెట్టిన కేసీఆర్‌.. అప్ప‌టి జ‌గ‌న్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారో త్స‌వానికి హాజ‌రయ్యారు. త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఏపీవైపు రాలేదు. అయితే.. టీఆర్ ఎస్‌ జాతీయ పార్టీ బీఆర్ ఎస్‌గా అవ‌త‌రించిన నేప‌థ్యంలో ఏపీపైనా కేసీఆర్ దృష్టి పెట్టారు. మూడు ప్రాంతాల్లో ఆయ‌న బ‌హిరంగ స‌భ‌లు సైతం పెట్ట‌నున్నార‌ని.. ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు […]

ఈ ఒక్క మాట‌తో వైసీపీ బెంబేలెత్త‌తోందా.. ఆ మాట ఇదే…!

గ్రామీణ స్థాయిలో వైసీపీ ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. అర్బ‌న్ స్థాయిలో మాత్రం ఒకింత ఇబ్బందిగానే ఉం దని పార్టీ అధిష్టానానికి.. నివేదిక‌లు అందాయని తెలిసింది. ప్ర‌స్తుతం పార్టీ త‌రఫున నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర మాలు.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటున్న‌నాయ‌కులు.. ఇలా.. అనేక కోణాల్లో వైసీపీ అధిష్టానం స‌ర్వే నివేదిక‌లు సేక‌రించింది. దీనిలో గ్రామీణ ప్రాంతాల్లో నెల నెలా 1నే పింఛ‌న్ అందుతుండ‌డంపై ప్ర‌జ‌లు ఆనందం గానే ఉన్నారు. ఇక ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోనూ ఇంతే హ్యాపీ క‌నిపిస్తోంది. అయితే.. అది […]

షాకింగ్‌: ఈ వైసీపీ మంత్రులు రాజీనామాలు చేసేస్తారా…!

జోరు మీదున్నావు.. అన్న‌ట్టుగా ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు చెందిన మంత్రులు కూడా.. జోరుమీదే ఉన్నారు. రాజ‌ధాని రైతులు చేస్తున్న పాద‌యాత్ర‌కు వ్య‌తిరేకంగా.. వారు బ‌ల‌మైన గ‌ళం వినిపిస్తున్నారు. నిజానికి గ‌తంలో న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం పాద‌యాత్ర నిర్వ‌హించిన‌ప్పుడు.. ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల్లోని వైసీపీ నాయ‌కులు ఈ రేంజ్లో స్పందించ‌లేదు. అంతేకాదు.. రైతుల‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించిన కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి వంటి వారు కూడా తెర‌మీదికి వ‌చ్చారు. మ‌రికొంద‌రు లోపాయికారీగా.. రైతుల‌కు స‌హ‌క‌రించార‌ని.. పార్టీ అధిష్టానం కూడా గుర్తించింది. అయితే.. ఈ […]

సోము వీర్రాజుకు పొలిటిక‌ల్ కాటు….!

అదేం ఖ‌ర్మ‌మో తెలియ‌దు కానీ.. పార్టీ పుంజుకుంటోంది.. ప్ర‌జ‌లు మ‌నవైపు మొగ్గుతున్నారు.. అని భావించే స‌మ‌యంలో బీజే పీలో పెద్ద ప్ర‌కంప‌న మొద‌ల‌వుతోంది. అధికార పార్టీపై.. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు వ‌చ్చి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. దీంతో అప్ప‌టి వ‌ర‌కు స్థానికంగా దూకుడు చూపించి.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించిన నాయ‌కులు.. చ‌తికిల ప‌డుతున్నారు. అంతేకాదు.. ఇక ప్ర‌జ‌ల ముందుకు ఎలా వెళ్లాల‌నే త‌ప‌న చెందుతున్నారు. త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. “మేం ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నాం. ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాం. […]

2024 ఎన్నిక‌ల్లో గెలుపే టార్గెట్‌గా జ‌గ‌న్ తెర‌చాటు వ్యూహం… దిమ్మ‌తిరగాల్సిందే..!

రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. అనేక అనుమానాల‌కు తావిస్తోందని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. రాజ‌ధాని విష‌యం.. ఇప్పుడు ఆమూలాగ్రం చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఒక‌వైపు.. రాజ‌ధాని రైతులు మ‌హాపాద‌యాత్ర 2.0ను ప్రారంభించారు. కేంద్రం రాజ‌ధానిపై చ‌ర్చిద్దాం.. ర‌మ్మ‌ని పిలుపునిచ్చింది. మూడు రాజ‌ధానులు కాదు.. ఒకే రాజ‌ధాని అని.. రాష్ట్ర హైకోర్టు తేల్చి చెప్పింది. ద‌రిమిలా.. మూడు రాజ‌ధానుల‌కే త‌మ మొగ్గు అంటూ.. మంత్రులు, నాయ‌కులు.. ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. వైసీపీ ప్ర‌భుత్వం.. ఏం […]

ఏపీ ప్ర‌జ‌ల‌పై బీజేపీ కొత్త గేమ్ స్టార్ట్‌… ఈ సారి న‌మ్మలేమా….!

రాష్ట్ర రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న చ‌ర్చ ఇదే. ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తికి మ‌ద్ద‌తు ఇస్తున్నామ ని.. ఇటీవ‌ల కాలంలో ప‌దే ప‌దే చెబుతున్న రాష్ట్ర క‌మ‌ల‌నాథులు.. రైతులు చేస్తున్న పాద‌యాత్ర‌లోనూ పాల్గొంటున్నారు. అంతేకాదు.. రైతుల ప‌క్షాన కూడా మాట్లాడుతున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు.. రాజ‌ధాని విష‌యంలో ఎలా ఉన్నా.. ఇప్పుడు బీజేపీ తీరు మారింద‌ని.. త‌మ‌కు అండ‌గా ఉంటుంద‌ని.. రైతులు భావిస్తున్నారు.అందుకే.. వారు చేస్తున్న ప్ర‌తి కార్య‌క్ర‌మానికీ.. బీజేపీ నేత‌ల‌ను కూడా ఆహ్వానిస్తున్నారు. అయితే.. ఇప్పుడు బీజేపీ […]