చైనా స్టీల్ అమరావతికి వచ్చేస్తోంది!

ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు చైనా ప్రభుత్వ రంగ సంస్థ ముందుకొచ్చింది. చైనా ప్రభుత్వరంగంలోని అతిపెద్ద ఉక్కు కంపెనీ అన్‌స్టీల్‌ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జరిపిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. 3 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేశారు. చైనా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమైనారు. ఆన్‌స్టీల్‌ కంపెనీతో జరిగిన సమావేశంలో నూతనంగా నిర్మిస్తున్న […]

సింగ’పూర్‌’ లో మనకి మిగిలేది పూరే నా?

సింగపూర్‌ చాలా చాలా అభివృద్ధి చెందింది. ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొని అభివృద్ధి బాట పట్టిన సింగపూర్‌ని చూసి ప్రపంచం గర్వపడుతుంది. ఆ సింగపూర్‌ని చూసి నేర్చుకోవాలంటూ వివిధ దేశాల ప్రముఖులు చెబుతారు. ఆ సింగపూర్‌ని మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సృష్టించాలని కలలుకంటున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడో ముఖ్యమైన అంశం ఉంది. సింగపూర్‌కి, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణ బాద్యతలు అప్పగించడం తప్పు కాదు. కానీ సింగపూర్‌ ప్రభుత్వం వేరు, అక్కడి కంపెనీలు వేరు. ఏ […]

పులిచింతల పంచాయితీ షురూ

విడిపోయినా అన్నదమ్ములుగానే కలిసుందాం అన్నది ఒట్టి మాటే..లోలోపల రెండు తెలుగు రాష్ట్రాలు జల జగడాలతో సతమతమౌతున్నాయి.తెలాంగాణా వాటాలో చుక్కనీరు కూడా మాకు అవసరంలేదు అని ఆంద్రప్రదేశ్ చెప్తోంటే మాకు రావాల్సిన వాటాకు మించి మేము ఒక్క చుక్క నీటి బొట్టును కూడా తీసుకొం అని తెలంగాణా వాదిస్తోంది.మరి సమస్యేంటా అనుకుంటున్నారా,అదేనండి ఈగో అండి ఈగో..మేమెందుకు ఒప్పుకోవాలి..మేమెందుకు దిగిరావాలి..కుదిరిన కాడికి సమస్యస్యల్ని జటిలం చేసేసి ఎవరికి వారు హీరోలమైపోదామనే తప్ప రాష్ట్ర ప్రయోజానాగురించి ఆలోచించేదెవరు?ప్రజలమధ్య విద్వేషాల్ని రెచ్చగొట్టేద్దాం పబ్బం […]

బలవంతపు సర్వేలు…. రైతుల్లో కలకలం

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు సర్వేలు రైతుల్లో కలకలం రేపుతోంది. రైతులు అనుమతి లేకపోయినా వారి భూముల్లో అధికారులు సర్వేలు చేస్తున్నారు. రికార్డులు సరిచేస్తామని నమ్మబలికి రెవెన్యూ అధికారులు సంతకాలు చేయించుకున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు.భైరెడ్డిపాలెంకు చెందిన బోయి గురమ్మకు సర్వే నెంబర్‌ 58లోని 1లో 4 ఎకరాలు భూముంది. ఎయిర్‌పోర్టుకు తన జిరాయితీ భూమిని ఇవ్వనని ఖరాఖండిగా చెప్పింది. అయితే అధికారులు వ్యూహాత్మకంగా గురమ్మ భూ రికార్డులు సరి చేస్తామని చెప్పి సంతకాలు […]

డబ్బులివ్వలేం రాష్ట్రానికి తేల్చి చెప్పిన కేంద్రం

రెవెన్యూ లోటును భర్తీ చేయలేమంటే కుదరదని, విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిందేనని కేంద్రానికి స్పష్టం చేసింది. ఒక్క రైతు రుణమాఫీ తప్ప ఏ ఒక్క పథకాన్ని తాము కొత్తగా తీసుకురాలేదని పేర్కొంది. రాష్ట్ర విభజన తర్వాత 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.16,078.76 కోట్ల రెవెన్యూ లోటు తలెత్తింది. కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక సాయంగా విడుదల చేసిన రూ.2,303 కోట్లను పరిగణలోకి తీసుకున్న తర్వాత 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 31 నాటికి రూ.13,775.76 […]

సీఎం ని కదిలించిన చిన్నారి.

కారుణ్య మరణం ప్రసాదించాలని కోరుతూ జ్ఞానసాయికి సంబంధించి ప్రచురితమైన మానవీయ కథనం రాష్ట్రమంతటా చర్చనీయాంశమైంది.రమణప్ప, సరస్వతి దంపతుల కుమార్తె ఎనిమిది నెలల జ్ఞానసాయికి పుట్టుకతో కాలేయ సంబంధిత వ్యాధి ఉంది. ఇప్పటికే లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించినా ఫలితం దక్కలేదు. తమ చిన్నారి కూతురు జ్ఞానసాయి కి  కారుణ్య మరణం ప్రసాదించాలని కోర్టు ని ఆశ్రయించిన తల్లి దండ్రులు గోడు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కదిలించించింది . జ్ఞానసాయి చికిత్సకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే […]

నీటి యుద్దాలు — కేంద్రం దొంగాట

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్దాలు కొనసాగుతున్నాయి. ఇరు తెలుగురాష్ట్రాల మధ్య నీటి సమస్య ను పరిష్కరించలేక కేంద్రం చేతులెత్తేసింది.ఇరు రాష్ట్రాల మధ్యనున్న నీటి సమస్య లను మీరే తేల్చుకోవాలని సూచించింది. కృష్ణా నీటి వాటాలు కొన్నాళ్ల పాటు యధాస్థితి లోనే కొనసాగుతాయని చెప్పింది. ఈ సమస్యకు పరిష్కారం లభించక పోవడం తో మరో నెల రోజుల పాటు గతసంవత్సరం లాగే నీటి వాటాలు ఉంటాయని తెలిపింది. ఈ లోగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు […]

ఆంధ్ర గజనీగా మారుతున్న చంద్రబాబు!!

అన్న మన అధినేతెంటి ఇలా చేస్తున్నారేంటి..? అన్నో మన సారుకు గతాన్ని గుర్తుచేయాలి.. అదేం కాదయ్యా మన సారు మరో గజినీగా మారారు. ఇవి ఎవరి మాటలు అనుకుంటున్నారా.. ఆంద్రప్రదేశ్ తెలుగు తమ్ముళ్ల చర్చలు.., ఈ మద్య ఇలాగే ఉంటున్నాయి. అసలు వాళ్లు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నారా? ఇంకెవరి గురించో కాదు సాక్షాత్తూ వాళ్ల అధినేత చంద్రబాబు గురించే..! ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రపంచదేశాల్లో గుర్తింపు పొందిన బాబు గజినీగా మారడం ఏంటి అనుకుంటున్నారా.. ఐతే ఇది […]

జలజగడం-రాజకీయ ప్రయోజనాలే అజెండా!

ఎడ్డెం అంటే  తెడ్డెం.. అన్న చందాన తయారయ్యింది ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదం. నీటి ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన నీటి కేటాయింపులపై కేంద్రం వద్ద పంచాయితీ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల మంత్రులు హరీష్‌రావు, దేవినేని ఉమామహేశ్వరరావు ఒక్క చోట కూర్చుని చర్చించుకున్నారు. షరామామూలుగానే చర్చలు ఓ కొలిక్కి రాలేదు.  పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం, ఇద్దర్నీ ఓ చోట కూర్చోబెట్టిందిగానీ, ఏకాభిప్రాయాన్నయితే తీసుకురాలేకపోతోంది. ‘ముందు మీరు మాట్లాడుకోండి.. మీకు సయోధ్య కుదరకపోతే ఆ  తర్వాత ఆలోచిస్తాం..’ […]