విశాఖలో ఉప్పు నిప్పులా ఉన్న మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడికి పార్టీ అధినేత చంద్రబాబు గట్టి క్లాస్ పీకారు. ముఖ్యంగా గంటా శ్రీనివాసరావుపై ఫైర్ అయ్యారు. `ఇక నిన్ను భరించలేను` అంటూ అసహనం వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో సఖ్యతగా ఉండకపోతే.. ఇక చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తే సహించబోనని స్పష్టంచేశారు. కొంతకాలం నుంచీ విశాఖలో గంటా వర్సెస్ అయ్యన్న వార్ జరుగుతోంది. అధినేత చంద్రబాబు ఎన్ని సార్లు వీరిద్దరినీ పిలిచి మందలించినా.. […]