గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు అండగా నిలిచిన వారిలో ఉద్యోగ ఐకాస ప్రధానమైనది! ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు నేతృత్వంలోని ఉద్యోగులు.. టీడీపీకి మద్దతుగా నిలిచారు. అంతేగాక ఉద్యోగ సంఘాలన్నింటినీ ఐక్యం చేయడంలో అశోక్బాబు కృషి ఎనలేనిది. అయితే ఇప్పుడు ఆయనపై ఉద్యోగులు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు! ముఖ్యంగా అశోక్బాబును టార్గెట్ చేస్తూ.. సరికొత్త సంఘానికి తెర తీశారు! ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ఆయన తీవ్రంగా విఫలమయ్యారని ఆరోపించారు. అంతేగాక కొత్తగా ఏర్పాటైన జేఏసీనే అసలైన జేఏసీ […]