ఏపీలోమండ‌లి ఛైర్మ‌న్ ప‌ద‌వి రేస్ లో అదృష్టవంతులెవరో..!

ఏపీలో కుల రాజ‌కీయాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ముఖ్యంగా కీల‌క ప‌ద‌వుల‌న్నీ ఒకే వ‌ర్గానికి చెందుతున్నాయ‌నే విమ‌ర్శ మూట‌గ‌ట్టుకుంటోంది టీడీపీ. త‌మ సామాజిక‌వ‌ర్గాల‌కు ఎప్పుడూ అన్యాయం జ‌రుగుతోంద‌ని కొన్ని వ‌ర్గాలు బాహాటంగా ప్ర‌క‌టించ‌క‌పోయినా అంత‌ర్గ‌తంగా మ‌థ‌న‌ప‌డుతూనే ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో మండ‌లి చైర్మ‌న్ ప‌ద‌వీ కాలం కూడా పూర్త‌వ‌బోతోంది.  ఈ నేప‌థ్యంలో ఈ ప‌ద‌వి ఎవ‌రికి దక్క‌తుంద‌నే చ‌ర్చ మొద‌లైంది. ముఖ్యంగా రెడ్డి. క్ష‌త్రియ వ‌ర్గానికి చెందిన నేత‌లు ఇప్పుడు.. ఈ ప‌దవిపై ఆశ‌పెట్టుకున్నారు. దీంతో ఈ రెండు […]