ఏపీ మండ‌లిలో 23 మంది కొత్త ఎమ్మెల్సీలు

ఏపీ శాస‌న మండ‌లిలో దాదాపు 23 మంది స‌భ్యుల స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో మండ‌లి చైర్మ‌న్ చ‌క్ర‌పాణి కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. వీరంతా 2017 ఫిబ్ర‌వ‌రి, మార్చి నాటికి త‌మ ప‌ద‌వీ కాలాల‌ను ముగించుకుంటారు. దీంతో ఈ ఎమ్మెల్సీ సీట్ల కోసం పోటీ ఇప్ప‌టి నుంచే ముమ్మ‌రంగా ఉంది. అధికార‌, ప్ర‌తిప‌క్షాలు ఒక‌దానికి మించి ఒక‌టి వ్యూహ ప్ర‌తివ్యూహాల‌తో ముందుకు పోతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ ఈ మొత్తం 23 స్థానాల్లోనూ పాగా వేయాల‌ని భావిస్తుండ‌గా.. […]