విజయవాడ మెట్రోకు కేంద్రం గండి

ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టుపై నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి! మూడేళ్లు గ‌డిచినా.. ఇప్ప‌టికీ మెట్రో ప్రాజెక్టు ప‌నుల్లో క‌ద‌లిక లేక‌పోవ‌డం ఇప్పుడు అనేక సందేహాల‌కు తావిస్తోంది. విభజ‌న త‌ర్వాత న‌వ్యాంధ్ర‌లో విజ‌య‌వాడ‌కు మెట్రోను కేటాయిస్తూ కేంద్రం.. అనేక ప్ర‌క‌ట‌న‌లు జారీచేసింది. అందుకు అనుగుణంగానే విజ‌య‌వాడ‌లో మెట్రో సాధ్యా సాధ్యాల‌పై ఇప్ప‌టికే నివేదిక కూడా రూపొందించింది. అయితే కేంద్రం తీసుకున్న నిర్ణ‌యంతో ప్ర‌స్తుతం విజ‌య‌వాడ‌లో మెట్రో రైలు క‌ల‌గానే మిగిలిపోనుంది. విభ‌జ‌న‌తో న‌ష్ట‌పోయిన ఏపీకి కేంద్రం అనేక వ‌రాల‌ను ప్ర‌క‌టించింది. […]