జనసేనాని పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడం ఖాయమై పోయిన నేపథ్యంలో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఎంత మెజారిటీ వస్తుంది? అసలు గెలుస్తారా? లేదా? ఇలాంటి సందేహాలకు కొదవలేదు. ఎందుకంటే.. తెలుగునాట కొన్ని దశాబ్దాల పాటు వెండి తెరపై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించి మెగాస్టార్గా వెలుగొందిన చిరంజీవి సైతం తన సొంత జిల్లా పశ్చిమ గోదావరి నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్పై అందరి దృష్టీ […]
Tag: AP
జగన్ రియాక్షన్తో షాక్లో రోజా..!
వైకాపా మహిళా విభాగంలో కీలక రోల్ పోషిస్తున్న నగరి ఎమ్మెల్యే రోజాకి ఆ పార్టీ బాస్ నుంచి సరైన మద్దతు లభించడం లేదా? రోజా విషయంలో జగన్ ఆశించిన స్థాయిలో రియాక్ట్ కావడం కాలేదా? రెండు రోజుల కిందట జరిగిన పోలీస్ వర్సెస్ రోజా ఎపిసోడ్లో జగన్.. రోజాకి ఝలక్ ఇచ్చారా? ఈ నేపథ్యంలో ఇక తన జబర్దస్త్కి ఫుల్ స్టాప్ పెట్టి సాఫ్ట్ కార్నర్ ఎంచుకోవాలని రోజా డిసైడ్ అయ్యారా? అంటే ఔననే ఆన్సరే వస్తోంది. […]
ఆ అంశాల్లో వాస్తు మరిచిపోయారా బాబు
`అమరావతికి వాస్తు బాగుంది. ఏ పని చేపట్టినా విజయమే` ఇది ఏపీ సీఎం చంద్రబాబు ఏ కార్యక్రమానికి వెళ్లినా.. పదేపదే ఈ విషయాన్నిఅట్టహాసంగా చెబుతుంటారు. ప్రతి కార్యక్రమానికి అమరావతి అంశాన్ని లింక్ చేసి చెప్పేస్తుంటారు. తన అనుభవాన్ని అంతా రంగరించి అమరావతికి ప్రత్యేకమైన బ్రాండింగ్ చేపట్టే పనిలో పడ్డారు. అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా.. మిగిలిన అంశాల్లో చంద్రబాబు `అమరావతి` సెంటిమెంట్ మాత్రం వర్కవుట్ కావడం లేదని వినిపిస్తోంది. `ఏపీకి అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడం శుభసూచకం`.. […]
టీడీపీకి షాక్: ఆ కీలక నేత పార్టీ వీడతాడా..!
కర్నూలు జిల్లా టీడీపీలో రాజకీయం రసకందాయంగా మారింది. ముఖ్యంగా ఆళ్లగడ్డ. నంధ్యాల ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ వైసీపీని వీడి టీడీపీలో చేరిన నాటినుంచి జిల్లాలో రాజకీయాలు హీటెక్కాయి. వీరి రాకతో శిల్పా వర్గం, ఆళ్లగడ్డ టీడీపీ ఇన్చార్జి గంగుల ప్రభాకర్ రెడ్డి వర్గం కూడా తీవ్ర అసంతృప్తితో ఉంది. అయితే శిల్పా వర్గం పార్టీ మారే అలోచనతో ఉంటే.. ఇప్పుడు గంగుల వర్గం కూడా దాదాపు పార్టీ మారడం ఖాయమైపోయింది. ఇక రేపో మాపో అన్నట్లు […]
ఏపీ పీసీసీ చీఫ్గా చిరు ,రఘువీరా వైసీపీలోకి జంప్..!
రాష్ట్ర విభజన దెబ్బతో ఏపీలో కాంగ్రెస్ ఉనికే ప్రశ్నార్థకమైంది. కాంగ్రెస్ నుంచి ఎప్పుడు ఏ నాయకుడు పార్టీకి గుడ్ బై చెపుతారో ? తెలియని పరిస్థితి ఉంది. అసలు ఏపీ కాంగ్రెస్లో కాస్త క్రేజ్ ఉన్న నాయకులు ఎవరా ? అని ప్రశ్నించుకుంటే వేళ్లమీద లెక్కపెట్టే పరిస్థితి కూడా లేదు. అలాంటి కాంగ్రెస్లో మిణుగురుల్లా ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి లాంటి ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యే పెద్ద […]
నాయకత్వం గొడవలో కాపు వెర్సెస్ బలిజలు
కాపులకు రిజర్వేషన్లు, రాజకీయ గుర్తింపు కోసం పోరాడుతున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి ఎదురు దెబ్బ తగిలేలా ఉంది, ముఖ్యంగా కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న బలిజ సామాజిక వర్గ నేతలు ఇప్పుడు ఈ ఉద్యమం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాపులతో పాటు తమకూ గుర్తింపు కావాలని వారు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వారు ఉద్యమానికి దురమైతే కాపు ఉద్యమం అటకెక్కినట్టే అని సంకేతాలు వినిపిస్తున్నాయి. కాపు సామాజికవర్గంలో కోస్తాలో వారిని […]
జగన్ ఆపరేషన్ సక్సెస్ – పేషెంట్ డెడ్
`ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్` అన్నట్లు ఉంది ప్రతిపక్ష వైసీపీ పరిస్థితి! గతంలో కంటే ప్రతిపక్ష నేత జగన్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు! హోదా విషయంలో విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా సంఘీభావం తెలిపి.. ప్రజల్లో కొంత మైలేజీ పొందారు. అయితే ఇంత చేస్తున్నా.. జగన్ తీరుపై సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. హోదా విషయంలో తొలి నుంచి పోరాడుతున్నా అది ప్రజల్లోకి చేరలేదు. కానీ సరైన సమయంలో జగన్ స్పందించినా.. విశాఖ ఎయిర్పోర్టులో […]
చంద్రబాబుకు మొదలైన 9 ఫీవర్
ఏపీలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సీఎం చంద్రబాబుకు అన్నీ సమస్యలే! రెవెన్యూ లోటు, కాపు రిజర్వేషన్లు, ప్రత్యేకహోదా ఉద్యమం.. ఇలా నిత్యం ఏదో ఒకది వెంటాడుతూనే ఉంది! వీటన్నింటినీ ఎలాగో నెట్టుకు వస్తున్న ఆయనకు.. ఇప్పుడు ఒక సెంటిమెంట్ భయం పట్టుకుంది. దీంతో ఇప్పుడు చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేంటంటే.. చంద్రబాబు నాయుడుకి 9 నంబర్తో ఉన్న సెంటిమెంట్ ఇప్పుడు హాట్ న్యూస్గా మారింది. సీఎం చంద్రబాబుకు నమ్మకాలు ఎక్కువే! […]
జనసేన-సీపీఐ జట్టు ఖాయమైందా?!
పవర్ స్టార్ పవన్ నేతృత్వంలోని జనసేన, జాతీయ పార్టీ సీపీఐల మధ్య పొత్తు కుదిరిందా? 2019 ఎన్నికల్లో కామ్రేడ్లతో కలిసి పవన్ పొలిటికల్ పోరుకు సిద్ధమవుతున్నారా? అంతకన్నా ముందు.. రాష్ట్రంలో పేదలు, అణగారిన వర్గాల పక్షాన పోరాడేందుకు రెండు పక్షాలూ రెడీ అవుతున్నాయా? అంటే.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పిన మాటలను బట్టి నిజమేనని అనిపిస్తోంది. ప్రజాచైతన్య పేరిట యాత్రలు నిర్వహిస్తున్న రామకృష్ణ.. నిన్న విశాఖ జిల్లా నర్సీపట్నం వచ్చారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఓ […]