ఉమ్మడి ఏపీలో హైదరాబాద్లోని పాత బస్తీకే పరిమితమైన ఎంఐఎం(ఆలిండియా మజ్లిస్ ఎ ఇత్తెహిదుల్ ముస్లిమీన్) పార్టీ.. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ తన జెండా ఎగిరేలా పక్కా ప్రణాళికతో దూసుకుపోతోంది. ఇప్పటికే తెలంగాణలోని పలు మునిసిపాలిటీల్లో పాగా వేసిన ఎంఐఎం.. తర్వాత మహారాష్ట్ర, యూపీల్లోనూ పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. ఇప్పుడు ఇదే క్రమంలో ఏపీపైనా ఈ పార్టీ నేతలు కన్నేశారు. పనిలో పనిగా.. ఏపీలో పాగా వేయడంతోపాటు తమపై ముస్లిపార్టీ అన్న ముద్రను తుడిచేసుకునేందుకు సైతం ఎంఐఎం నేతలు […]