ఏపీలో అధికార టీడీపీకి నాయకుల మధ్య గొడవలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిందన్నమాటే గాని చంద్రబాబుకు నాయకుల మధ్య గొడవలు సర్దుబాటుతోనే సగం కాలం గడిచిపోతోంది. టీడీపీ వర్సెస్ టీడీపీ నాయకులతో పాటు టీడీపీ వర్సెస్ బీజేపీ నాయకుల మధ్య అస్సలు పొసగడం లేదు. ఈ క్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా కొనసాగుతోన్న పైడికొండల మాణిక్యాలరావుతో పాటు జిల్లా పరిషత్ […]