తెలుగు నటి రమ్యశ్రీ రాజకీయాల పట్ల చాలా ఉత్సాహంతో ఉన్నట్టు కనిపిస్తోంది. గతంలో పలు ఆ టైప్ సినిమాల్లో నటించి హాట్ ఇమేజ్ తెచ్చుకున్న రమ్యశ్రీ గతేడాది తన స్వీయదర్శకత్వంలో ఓమల్లి సినిమాలో కూడా నటించింది. ఆ సినిమా సరిగా ఆడకపోయినా ఆమెకు నటనకు, డైరెక్షన్కు కాసిన్ని ప్రశంసలు అయితే దక్కాయి. ఇదిలా ఉంటే రమ్యశ్రీ బీజేపీలోకి చేరే అవకాశాలున్నట్టు వార్తలు వినవస్తున్నాయి.
రమ్యశ్రీ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని ఢిల్లీ వెళ్లి మరీ కలిశారు. మరి వారిద్దరి మధ్య ఆమె పార్టీలో చేరే అంశంపై చర్చలు జరిగాయో లేదో గాని వెంకయ్య మాత్రం తనను రమ్యశ్రీ మర్యాద పూర్వకంగానే కలిసినట్టు చెప్పారు. మోడీ చేపడుతోన్న అభివృద్ది కార్యక్రమాలకు తాను ఆకర్షితురాలిని అయనట్టు కూడా రమ్య అన్నట్టు వెంకయ్య తెలిపారు.
మోడీ చేపట్టే సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆమె ఉత్సాహంతో ఉన్నట్లు వెంకయ్య వెల్లడించారు.ఇక రమ్య శ్రీ మాట్లాడుతూ తాను ఆంధ్రా ప్రాంతానికి చెందిన తాను మోడీ చేపడుతోన్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితురాలనయ్యాయని… ఈ నేపథ్యంలోనే తాను కేంద్ర మంత్రి వెంకయ్యను కలిశానని అన్నారు. ఏదేమైనా రమ్యశ్రీ మాటలు చూస్తుంటే ఆమె త్వరలోనే కాషాయ దళం గూటికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.