టాలీవుడ్ను డ్రగ్ ఇష్యూ ఓ కుదుకు కుదిపేసింది. ఈ స్కాంలో ఏకంగా 12 మంది సెలబ్రిటీలను సిట్ వాచారించింది. ఒకేసారి ఇండస్ట్రీలో ఇంతమంది ప్రముఖల పేర్లు బయటకు రావడం ఓ సంచలనం అయితే వాళ్ల గురించి మీడియాలో వచ్చిన వార్తలు కూడా అంతే సంచలనంగా మారాయి. వీరి విచారణ తర్వాత ఈ ఇష్యూ ప్రస్తుతం సైలెంట్ అయిన సంగతి తెలిసిందే.
పూరి, రవితేజ, ఛార్మి, సుబ్బరాజు, శ్యాం కె నాయుడు, ముమైత్ ఖాన్, నందు, తనీష్, తరుణ్ లాంటి వారిపై ఈ ఇష్యూలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక వీరి నుంచి సిట్ బ్లడ్ శాంపుల్స్ కూడా తీసుకుంది. వాటిని ల్యాబ్లో పరీక్షలకు కూడా పంపారు. మొత్తం అందరి నుంచి సేకరించిన బ్లడ్ శాంపుల్స్లో ఒకరు మాత్రం చాలా రోజులుగా డ్రగ్స్ తీసుకుంటున్నట్టు సిట్ దాదాపు కన్ఫార్మ్ చేసినట్టు టాక్.
అతడి పేరును రివీల్ చేసే ముందు మరోసారి అతడి బ్లడ్ శాంపుల్స్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి పరీక్ష చేయించాలని చూస్తున్నారట. వాస్తవానికి ఈ బ్లడ్ శాంపుల్స్ ఫలితాల్లో కొందరు అప్పుడప్పుడూ డ్రగ్స్ తీసుకుంటున్నట్టు తేలింది. వీరిపై చర్యలు తీసుకోవాలని చూసినా ఉన్నత స్థాయిలో ప్రెజర్ రావడంతో చివరకు ఈ కేసు ఇప్పటకి అయితే సద్దు మణిగింది.
ఇదిలా ఉంటే బ్లడ్ శాంపుల్స్ తీసుకున్న సుదీర్ఘ కాలంగా డ్రగ్స్ వాడుతూ చాలా మందికి డ్రగ్స్ సరఫరా చేసిన ఆ వ్యక్తిపై మాత్రం చర్యలు తప్పవని తెలుస్తోంది. మరి సదరు వ్యక్తిపై చర్యలు తప్పవంటున్నారు. ఇండస్ట్రీ ఇన్నర్ టాక్ ప్రకారం అతడు హీరో కాని ఓ ప్రముఖ సెలబ్రిటీ అని తెలుస్తోంది.