టాలీవుడ్ యంగ్టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జై లవ కుశ సినిమాలో నటిస్తున్నాడు. పవర్ – సర్దార్ గబ్బర్సింగ్ సినిమాల ఫేం కేఎస్.రవీంద్ర (బాబి) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై కళ్యాణ్రామ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమాను ఏకధాటిగా జరిగే షెడ్యూల్లో షూటింగ్ ఫినిష్ చేసి సెప్టెంబర్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా కోసం ఇద్దరు టాప్ డైరెక్టర్లు కన్నేసినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా రేసులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో పాటు మరో స్టార్ డైరెక్టర్ వివి.వినాయక్ ఉన్నారట. త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా అయిన వెంటనే ఎన్టీఆర్ సినిమా కోసం అప్పుడే తన టీంతో కథ రెడీ చేయించే పనిలో ఉన్నాడట.
ఇక ఇటీవలే ఖైదీ నెంబర్ 150తో హిట్ను తన ఖాతాలో వేసుకున్న వివి.వినాయక్ సైతం ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా రేసులో ఉన్నాడట. ఎన్టీఆర్ కోసం అదిరిపోయే మాస్ ఎలిమెంట్స్ ఉన్న స్టోరీని వినాయక్ రెడీ చేయిస్తున్నాడట. గతంలో వీరిద్దరి కాంబోలో ఆది – సాంబ – అదుర్స్ వచ్చి హిట్ అయిన సంగతి తెలిసిందే. ఖైదీతో ఫామ్లోకి వచ్చిన వినాయక్ తిరిగి ఇప్పుడు ఎన్టీఆర్తో హిట్ కొట్టాలని కసితో ఉన్నాడట. మరి వీరిద్దరిలో ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాకు ఏ డైరెక్టర్ ఫిక్స్ అవుతాడో చూడాలి.