రెచ్చిపోతున్న రేష్మి-కురుస్తున్నకనక వర్షం

‘గుంటూరు టాకీస్ త‌రువాత  రంజాన్ ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా ర‌ష్మిగౌతమ్ హీరోయిన్ గా విడుద‌ల‌యిన చిత్రం ‘అంతం’. ద‌ర్శ‌క‌ నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ అతిత‌క్కువ‌ బ‌డ్జెట్ లో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించారు.చరణ్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. 300 ధియోట‌ర్స్ కి పైగా ఆంద్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణా, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో జులై 7న విడుద‌ల చేశారు. విడ‌దల‌యిన అన్ని సిటీస్ లో స్పీడ్ ఫుల్స్ తో, టౌన్స్ లో 90%  ఓపెనింగ్ తో మెద‌టిరోజునే 1.26 కొట్ల గ్రాస్ ని వ‌సూలు చేసి ఇండిపెండెంట్ చిన్న చిత్రాల్లో రికార్డు గా నిలిచింది.

రేష్మి అందాల ఆరబోతతో రిలీజ్ కి ముందే మంచి హైప్ క్రియేట్ చేసిందీ సినిమా.గుంటూరు టాకీస్ తరువాత రేష్మి కి డిమాండ్ బాగా పెరిగింది.దానికి తోడు రేష్మి కూడా లిమిట్స్ లేకుండా అందాలను ఆరబోస్తోంది.క్లాస్ మాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాలు,ముక్యంగా యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి రేష్మి సినిమాలు.