‘రేసు గుర్రం’ రిపీట్ చేస్తున్నారు

సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. హీరోహీరోయిన్లు-హీరోడైరక్టర్-డైరక్టర్ హీరోయిన్ ఈ కలయికలో చాలా సినిమాలు రిపీట్ అవుతుంటాయి. ప్రేక్షకులను కట్టిపడేస్తుంటాయి. తాజాగా ఇలాంటి క్రేజీ కాంబినేషన్ పునరావృతం కానుంది. ‘రేసు గుర్రం’లో ఆకట్టుకున్న అల్లు అర్జున్-శృతి హాసన్ లు మళ్లీ ఓ సినిమాలో నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తారని సమాచారం.

‘రేసు గుర్రం’లో శుతి హాసన్ అల్లు అర్జున్ తో జోడీ కట్టింది. ఇటు హరీశ్ శంకర్ కూ ఆమెతో మంచి పరిచయమే ఉంది. పవన్ కల్యాణ్ తో హరీశ్ తెరకెక్కించిన ‘గబ్బర్ సింగ్’లో ఆమే కథానాయిక. దీంతో శృతి పనితీరుపై అర్జున్, హరీశ్ లకు మంచి అభిప్రాయం ఏర్పడింది. అందుకే.. వారు శృతివైపే మొగ్గుచూపుతున్నారని వినికిడి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు లేదా సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది.