కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన వివేగం (తెలుగులో వివేకం) సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ఫీవర్లో కోలీవుడ్ ఊగుతుంటే టోటల్ సౌత్ కూడా ఎంతో ఆసక్తితో ఉంది. అజిత్ చివరి చిత్రం వేదాళం రిలీజ్ అయ్యి రెండేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో… ‘తల’ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా వెయిట్ చేస్తున్నారు.
టాలీవుడ్లో సినిమాటోగ్రాఫర్గా కెరీర్ స్టార్ట్ చేసిన శౌర్యం, శంఖం సినిమాలతో ఇక్కడ ప్రేక్షకులకు పరిచయస్తుడే. ఆ తర్వాత దరువు సినిమా కూడా శివ చేశాడు. ఇక అజిత్ చివరి చిత్రం వేదాళం సినిమాను కూడా శివే తెరకెక్కించాడు. ఇప్పుడు వివేగం సినిమాను సైతం భారీ బడ్జెట్తో శివ తెరకెక్కించాడు.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, అందాల భామలు కాజల్ అగర్వాల్, అక్షరలతోపాటు పలువురు హాలీవుడ్ స్టంట్ ఆర్టిస్టులు నటించారు. ఇంటర్నేషనల్ స్పై యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఫస్ట్లుక్ నుంచి ట్రైలర్, ఆడియో వరకు అన్నింటికీ ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
తమిళనాడులో అయితే ఈ సినిమా 90 శాతం థియేటర్లలో రిలీజ్ అవుతోంది. కేరళలో అక్కడి స్టార్ హీరోల చిత్రాలకు ధీటుగా సుమారు 300 థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో కూడా భారీగా థియేటర్లలలో రిలీజ్ చేస్తున్నారు. ఓవరాల్గా కోలీవుడ్ మొత్తం అయితే వివేగం ఫీవర్లో మునిగిపోయింది.