మాదక ద్రవ్యాల కేసు సినీ తారలను ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. మొన్నటికి మొన్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్ హీరో రవితేజ వంటి హేమాహేమీలను పోలీసులు గంటల తరబడి ప్రశ్నించారు. అలాగే సినీ ఫీల్డ్ అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రశ్నించారు సిట్ పోలీసులు. ఇక, ఇప్పుడు తాజా మరో ముగ్గురికి నోటీసులు పంపారు. ఇప్పటి వరకు విచారించిన పదకొండు మంది సినీ ప్రముఖులు చెప్పిన వివరాల్ని విశ్లేషిస్తూ.. వారుచెప్పిన దానికి సంబంధించిన ఆధారాల్ని సేకరించటంతో పాటు.. మరింత లోతుగా అధికారులు ఈ కేసును విచారిస్తున్నారు.
తాజాగా మరో ముగ్గురు సినీ తారలకు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ ముగ్గురిలో ఒకరు ప్రముఖ సినీ హీరోయిన్ అయితే.. మరో ఇద్దరు మాత్రం ప్రముఖ సినీ కుటుంబాలకు చెందిన సినీ తారలుగా చెబుతున్నారు. డ్రగ్స్ వినియోగం విషయంలో ఈ ముగ్గురికి నేరుగా సంబంధాలు ఉన్నట్లుగా చెబుతున్నారు.
మరీ ముఖ్యంగా ఒక ప్రముఖ హీరోయిన్ కు సంబంధించి బయటకు వస్తున్న సమాచారం ఆశ్చర్యకరంగా మారింది. ఆ మధ్యన జరిగిన ఒక సినీ ఫంక్షన్లో సదరు హీరోయిన్ డ్రగ్స్ ను అందరి ముందే తీసుకుందని.. డ్రగ్ ను సేవించిన తర్వాత ఆమె పడిపోయిందని.. ఆమెను తీసుకొని మరో నటుడు ఇంటికి తీసుకెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది.
దీనికి సంబంధించిన ఒక వీడియో ఒకటి అధికారులు సేకరించారని.. మిగిలిన వివరాలకు సంబంధించిన ఆధారాల్ని సేకరించే పని మీద పడినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ ముగ్గురు సినీ ప్రముఖులకు నోటీసులు ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా తారలు డ్రగ్స్ను విడిచి పెట్టకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.