బాలయ్య మ‌హేష్ కోసం భారీ స్కెచ్ వేసిన టాప్ డైరెక్టర్

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబుకు గ‌త నాలుగేళ్ల‌లో ఒక్క శ్రీమంతుడు సినిమా మాత్ర‌మే హిట్ ఉంది. వ‌న్‌, ఆగ‌డు, బ్ర‌హ్మోత్స‌వంతో పాటు లేటెస్ట్ మూవీ స్పైడ‌ర్ కూడా భారీ డిజాస్ట‌ర్ అయ్యింది. వ‌రుసగా మ‌నోడి సినిమాలు క‌నీసం యావ‌రేజ్ కూడా కాదు క‌దా డిజాస్ట‌ర్లు అవుతుండ‌డంతో మ‌హేష్ డిఫెన్స్‌లో ప‌డ్డాడు. ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో భ‌ర‌త్ అను నేను సినిమా చేస్తోన్న మ‌హేష్ ఈ సినిమాతో హిట్ కొట్టి ట్రాక్‌లోకి ఎక్కాల‌ని క‌సితో ఉన్నాడు.

భ‌ర‌త్ అను నేను పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే మ‌హేష్ చ‌ల‌సాని అశ్వ‌నీద‌త్ – దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాకు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్‌పై క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. మ‌నోడు ఓ అగ్ర హీరోతో ఓ టాప్ డైరెక్ట‌ర్ కాంబోలో మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేస్తున్నాడ‌ట‌.

ఈ క్రేజీ ప్రాజెక్టుపై వ‌స్తోన్న న్యూస్ వింటుంటేనే ఆస‌క్తిగా ఉంది. ఊర‌మాస్ సినిమాల డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను డైరెక్ష‌న్‌లో బాల‌య్య హీరోగా ఓ సినిమా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో కథను మలుపు తిప్పే పాత్ర కీలకం కానుందట. దీంతో మహేష్ తో ఆ స్పెషల్ రోల్ ని చేయించాలని బోయపాటి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం వ‌రుస డిజాస్ట‌ర్ల‌తో ఉన్న మ‌హేష్ వైవిధ్య‌మైన రోల్స్ కోసం ట్రై చేస్తున్నాడు. మ‌రి ఈ టైంలో బాల‌య్య సినిమాలో ఈ స్పెష‌ల్ రోల్ మ‌హేష్ ఓకే చేస్తాడా ? లేదా ? అన్న‌ది చూడాలి. బోయ‌పాటి మాత్రం ఈ రోల్‌ను మ‌హేష్‌తోనే చేయించాల‌ని గ‌ట్టిగా డిసైడ్ అయ్యాడ‌ట‌. మ‌రి మ‌నోడు మ‌హేష్‌ను ఎంత వ‌ర‌కు ఒప్పిస్తాడో ? చూడాలి.