సాయి ప‌ల్ల‌వికి-నానికి మ‌ధ్య గొడ‌వ‌కు ఇదే కార‌ణ‌మా..!

వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోన్న నేచుర‌ల్ స్టార్ నాని – సాయి ప‌ల్ల‌వి కాంబినేష‌న్‌లో ఏంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యుస‌ర్ దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. డిసెంబ‌ర్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోన్న ఈ సినిమా షూటింగ్ టైంలో నానికి, సాయి ప‌ల్ల‌వికి మ‌ధ్య గొడవ జ‌రిగింద‌ని.. దీంతో నాని సాయిప‌ల్ల‌విపై కేక‌లు వేస్తూ షూటింగ్ స్పాట్ నుంచి కోపంతో బ‌య‌ట‌కు వెళ్లిపోయాడ‌న్న వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. 

ఆ త‌ర్వాత చిత్ర నిర్మాత దిల్ రాజు- ద‌ర్శ‌కుడు జోక్యం చేసుకుని హీరోయిన్ సాయి ప‌ల్ల‌వితో నానికి సారీ చెప్పించి షూటింగ్‌కు బ్రేక్ లేకుండా చేశార‌న్న టాక్ కూడా వ‌చ్చింది. మ‌రి వీరిద్ద‌రి మ‌ధ్య అస‌లు గొడ‌వ‌కు కార‌ణం ఏంటా ? అని ఆరా తీస్తే అస‌లు విష‌యం ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ వ‌ర్గాల ద్వారా లీక్ అయ్యింది. 

ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోన్న టైంలో ఓ కీల‌క స‌న్నివేశానికి సంబంధించి డైలాగుల‌పై నాని సాయిప‌ల్ల‌వికి స‌ల‌హా ఇవ్వ‌బోయాడ‌ట‌. దీంతో ఫైర్ అయిన సాయి నువ్వు నాకు చెప్పేదేంట‌ని నానితో వాగ్వివాదానికి దిగింద‌ట‌. మాటా మాటా పెర‌గ‌డంతో చివ‌ర‌కు చిన్న‌పాటి గొడ‌వ జ‌ర‌గ‌డం.. నాని కోపంతో షూటింగ్ స్పాట్ నుంచి నిష్క్ర‌మించ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయ‌ట‌.

ఆ త‌ర్వాత నిర్మాత‌, ద‌ర్శ‌కుడు జోక్యం చేసుకుని వీరి మ‌ధ్య వివాదం ప‌రిష్క‌రించేలా చేసినా వీరు ఆ త‌ర్వాత కూడా ఎడ‌మొఖం పెడ‌మొఖంగానే ఉంటున్నార‌ట‌. ఇక సాయి ప‌ల్ల‌వి క్యారెక్ట‌ర్ గురించి కూడా ఇండ‌స్ట్రీలో మ‌రో టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. సాయి ప‌ల్ల‌వి మంచి న‌టే అయినా వ‌రుస హిట్ల‌తో ఆమెకు త‌ల‌పొగ‌రు ఎక్కువైంద‌ని…. ఇప్పుడు ఆమెలో కేర్‌లెస్ ఎక్కువైంద‌ని అంటున్నారు. సాయి ప‌ల్ల‌వికి ఉన్న టాలెంట్‌కు తోడు ఆమె కాస్త అణుకువ‌గా ఉంటే ఆమె కెరీర్ ఇక్క‌డ ఓ వెలుగు వెలుగుఉంద‌ని లేనిప‌క్షంలో ఆమె ఇక్క‌డ స్టార్ హీరోయిన్‌గా కొన‌సాగ‌డం క‌ష్ట‌మే అంటున్నారు.