చైతు – స‌మంత రిసెప్ష‌న్‌కు స్టార్ల డుమ్మా

టాలీవుడ్ సినీజ‌నాలు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేసిన చైతు – స‌మంత పెళ్లి అయ్యింది….ఇక తాజాగా వీరిద్ద‌రి రిసెప్ష‌న్ కూడా జ‌రిగిపోయింది. హైద‌రాబాద్‌లోని ఎన్ క‌న్వెన్ష‌న్‌లో వీరి విందు చాలా గ్రాండ్‌గా జ‌రిగింది. మొత్తానికి ఈ విందుతో నాగ్ స‌త్తా చాటాడు. నాగ్ ప్ర‌తి ఒక్క‌రిని ద‌గ్గ‌రుండి మ‌రీ ఆహ్వానించాడు. ఇక మీడియాకు ఈ విందులో ఇంపార్టెన్స్ ఇవ్వ‌డం ద్వారా నాగ్ మీడియాతో ఎలాంటి స్పెష‌ల్ రిలేష‌న్ మెయింటైన్ చేస్తాడో మ‌రోసారి స్ప‌ష్ట‌మైంది. 

మీడియా వాళ్ల‌తో చైతు – స‌మంత చాలా ఓపిక‌గా ఫొటోల‌కు స్టిల్స్ ఇచ్చారు. ఎవ‌రు ఎన్నిసార్లు మ‌రోస్టిల్ కోసం ఫొటోలు అడిగినా చైతు – స‌మంత కూల్‌గా న‌వ్వుతూనే స్టిల్స్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎంతోమంది స్టార్లు మెరిసినా ఇండ‌స్ట్రీకి చెందిన ముఖ్య‌మైన వాళ్లు క‌న‌డ‌ప‌క‌పోవ‌డం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది.

టాలీవుడ్ టాప్ హీరోలు అయిన మ‌హేష్‌, ఎన్టీఆర్‌, ప్ర‌భాస్ వీళ్లు ఈ కార్య‌క్ర‌మానికి రాలేదు. వీళ్లంతా ఆదివారం హైద‌రాబాద్‌లోనే ఉన్నారు. రెండో ఆదివారం కావ‌డంతో షూటింగ్‌లు కూడా క్యాన్సిల్. ఖాళీగా ఉన్నా కూడా వీరు స‌మంత‌-చైతు రిసెప్ష‌న్ విందుకు ఎందుకు రాలేదా ? అన్న ప్ర‌శ్న‌లు, సందేహాలు స‌హ‌జంగానే అంద‌రిలోను త‌లెత్తాయి. ఏదైనా వ్య‌క్తిగ‌త ప‌నుల్లో ఉండి వీరు ఈ కార్య‌క్ర‌మానికి రాలేదా ?  లేదా ? అన్న‌ది వాళ్ల‌కే తెలియాలి.