టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై లవకుశ. ఎన్టీఆర్ కెరీర్లోనే ఫస్ట్ టైం ట్రిఫుల్ రోల్ చేస్తుండడంతో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచే భారీ హైప్ తెచ్చుకుంది. ఎన్టీఆర్ చివరి మూడు సినిమాలు ఒకదానిని మించి మరొకటి హిట్ అయ్యాయి. దీంతో ఈ సినిమా రూ. 115 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ బిజినెస్లో తెలుగు థియేట్రికల్ రైట్స్ రూ.86 కోట్లు ఉండగా తెలుగు శాటిలైట్ హక్కులు రూ .14 కోట్లు, హిందీ శాటిలైట్, డబ్బింగ్ హక్కులు రూ.11 కోట్లు ఉన్నాయి.
ఈ లెక్కన ఈ సినిమా హిట్ అవ్వాలంటే రూ.100 కోట్లకు పైగా థియేట్రికల్ షేర్ రావాల్సి ఉంది. ఎన్టీఆర్ చివరి సినిమా జై లవకుశ రూ.83-84 కోట్ల థియేట్రికల్ షేర్ కొల్లగొట్టింది. దీంతో సినిమాపై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో జై లవకుశ సులువుగానే రూ.100 కోట్ల థియేట్రికల్ షేర్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. అంటే కాస్త అటూ ఇటూగా రూ. 150 కోట్ల గ్రాస్ వసూళ్లు రావాల్సి ఉంటుంది.
ఇక తొలి ఆరు రోజులు దాదాపు ఏపీ, తెలంగాణలో ఉన్న అన్ని స్క్రీన్లు జై లవకుశకు అందుబాటులో ఉన్నాయి. దీంతో సినిమాకు హిట్ టాక్ వస్తే వసూళ్లకు డోకా ఉండదు. 27న స్పైడర్, 29న మహానుభావుడు వస్తున్నాయి.ఈ 6 రోజులే సినిమాకు వసూళ్ల పరంగా కీలకం కానున్నాయి. ఇక ఈ మొత్తం చూస్తే ఈసారి తారక్ టార్గెట్ కాస్త పెద్దగానే ఉన్నట్టు కనిపిస్తోంది. కొనుగోలుదారులకు ఈ మొత్తం రికవర్ అవ్వాలంటే సినిమా భారీ విజయాన్ని సాధించాలి. మరి జై లవకుశ ఏం చేస్తుందో చూడాలంటే ఈ నెల 21 వరకు ఆగాల్సిందే.