‘ జై ల‌వ‌కుశ ‘  పొలిటిక‌ల్ సెటైర్లు ఎవ‌రికో…!

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన జై ల‌వ‌కుశ సినిమా మ‌రో ఐదు రోజుల్లో థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌స్తుండ‌డ‌తో అటు నంద‌మూరి, ఎన్టీఆర్ అభిమానుల‌కే కాకుండా యావ‌త్ టాలీవుడ్ సినీ అభిమానుల‌తో పాటు ఏపీలోని రాజ‌కీయ‌వ‌ర్గాలు కూడా సినిమాపై ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు.

సెన్సార్ కార్య‌క్ర‌మాలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా యూ / ఏ స‌ర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ మూడు వ‌రుస హిట్ల‌తో ఉండ‌డంతో గ‌తంలో ఎన్టీఆర్ సినిమాల‌కు జ‌ర‌గ‌ని రేంజ్‌లో ఈ సినిమాకు ఏకంగా రూ. 112 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఈ సినిమాకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ న్యూస్ రాజ‌కీయ వ‌ర్గాల్లో కూడా పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సినిమాలో రెండు మూడు పొలిటిక‌ల్ పంచ్ డైలాగులు ఉన్నాయ‌ట‌. ఈ డైలాగ్స్‌కు సెన్సార్ కూడా అభ్యంత‌రం చెప్ప‌డంతో మ్యూట్ ప‌డింద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ డైలాగులు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను టార్గెట్ చేసేవిగా ఉన్నాయ‌ట‌. అయితే కాంట్ర‌వ‌ర్సీ విష‌యాల‌కు దూరంగా ఉండే క‌ళ్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్ ప‌వ‌న్‌ను టార్గెట్ చేసే డైలాగులు త‌మ సినిమాలో పెడ‌తారా ? అన్న సందేహాలు కూడా మ‌రికొంద‌రు వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్ గ‌తంలో న‌టించిన సినిమాల్లో ఈ త‌ర‌హా డైలాగులు కొన్ని ఉన్నాయి. దీంతో ఇప్పుడు జై ల‌వ‌కుశ సినిమాలో పొలిటిక‌ల్ సెటైర్ల మ్యాట‌ర్ కూడా హాట్ టాపిక్‌గా మారింది. మ‌రో టాక్ ఏంటంటే సినిమాపై భారీ బ‌జ్ ఉన్న నేప‌థ్యంలో కొంద‌రు కావాల‌నే ఈ నెగిటివ్ ప్ర‌చారం చేస్తున్నార‌ని అంటున్నారు. అస‌లు ఈ వార్త‌ల‌న్ని నిజాలేనా ? లేదా రూమ‌ర్లేనా ? అన్న‌ది తేలాలంటే ఈ నెల 21 వ‌ర‌కు ఆగాల్సిందే.