‘ జై ల‌వ‌కుశ ‘ 2 వీక్స్ బాక్సాఫీస్ రిపోర్ట్‌… సంచ‌ల‌నాల తార‌క్‌

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన జై ల‌వ‌కుశ సినిమా మూడో వారంలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. యావ‌రేజ్ టాక్‌తో స్టార్ట్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సేఫ్ జోన్‌కు దగ్గ‌ర‌వుతోంది. ఈ నెల 21న ద‌స‌రాకు వారం రోజుల ముందుగానే భారీగా రిలీజ్ అవ్వ‌డం సినిమాకు బాగా క‌లిసొచ్చింది.

రెండు వారాల‌కు గాను వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.125 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింది. రెండు వారాల‌కు ఏపీ+తెలంగాణ‌లో రూ 54.87 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఇక వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ 73.24 కోట్ల కలక్షన్స్ సాధించింది. ఇక ఫుల్ ర‌న్‌లో ఈ సినిమా రూ.80 కోట్ల షేర్ మార్క్ దాటేసి తార‌క్ కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ షేర్ సాధించిన సినిమాగా రికార్డుల‌కు ఎక్క‌నుంది.

సీడెడ్‌లో దుమ్ము రేపేసిన ఈ సినిమా తెలుగు సినిమా వ‌సూళ్ల‌కు కీల‌క‌మైన నైజాంలో ఏరియాలో స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు జై ల‌వ‌కుశ అక్క‌డ 15 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం. ఎన్టీఆర్ కెరియర్లోనే నైజామ్ లో ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన సినిమాగా ఇది రికార్డుల‌కు ఎక్కింది.

ఇక ఈ యేడాది అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన సినిమాల జాబితాలో జై ల‌వ‌కుశ సినిమాకు టాప్-3 ప్లేస్ ద‌క్క‌డంతో నంద‌మూరి, ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేవు. ఇక ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే.