‘ జయజానకీ నాయక ‘ బిజినెస్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే

టాలివుడ్ లో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అయిన మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను తాజా సినిమా జ‌య‌జాన‌కీ నాయ‌క‌. గ‌తేడాది స‌రైనోడు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన బోయ‌పాటి ఇప్పుడు జ‌య‌జాన‌కీ నాయ‌క‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ఆగ‌స్టు 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీను – రకుల్ ప్రీత్ సింగ్ – ప్రగ్య జైస్వాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా బిజినెస్ ఓ రేంజ్‌లో జ‌రిగింది. ఈ సినిమా బిజినెస్ రూ. 45 కోట్లు జ‌రిగిందంటే అది బోయ‌పాటి స్టామినాయే అని ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

జ‌య‌జాన‌కీ నాయ‌క తెలుగు శాటిలైట్ హక్కులు 5.5 కోట్లకు అమ్ముడైనట్లు టాక్. అలానే హిందీ డబ్బింగ్ రైట్స్ 7 కోట్లకి – నైజాం 9.5 కోట్లకి – ఆంధ్ర ఏరియా మొత్తం 20 కోట్లకి – సీడెడ్ 7.2 కోట్లకి సేల్ అయినట్లుగా ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం. బెల్లంకొండ శ్రీను గ‌త‌ సినిమాలకి రాని క్రేజ్ ఈ సినిమాకి రావడానికి కారణం బోయపాటి అన్న‌ది తెలిసిందే.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌కు ఈ ట్యూబ్‌లో సూప‌ర్ రెస్పాన్స్ రావ‌డంతో సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. రిలీజ్‌కు ముందే ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తోన్న ఈ జాన‌కీ నాయ‌కుడు రిలీజ్ అయ్యాక ఇంకెన్ని రికార్డులు త‌న ఖాతాలో వేసుకుంటాడో ? చూడాలి.