టాలీవుడ్లో ఆగస్టు నెలంతా వరుసగా క్రేజీ ప్రాజెక్టులు రిలీజ్ అవుతున్నాయి. సాధారణంగా ప్రతి నెలలోను ఒకటో రెండో క్రేజీ ప్రాజెక్టులు ఉంటాయి. అయితే ఆగస్టు నెలంతా మంచి అంచనాలు ఉన్న సినిమాలే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రతి వారం ఇక్కడ టఫ్ కాంపిటేషనే ఉంది. ముందుగా ఫస్ట్ శుక్రవారం 4వ తేదీన కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన నక్షత్రం, సుకుమార్ నిర్మాణంలో రూపొందిన దర్శకుడు చిత్రాలు రిలీజ్ కానున్నాయి.ఒకటి క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించింది, రెండోది సుకుమార్ బ్యాక్ ఉన్న సినిమా కావడంతో ఈ రెండు సినిమాల రిజల్ట్పై ఆసక్తి ఉంది.
ఇక ఆగస్టు రెండో వారంలో పోరు అదిరిపోనుంది. నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన లై ఆగస్టు 11న వస్తుండగా అదే రోజు తేజ దర్శకత్వంలో రానా – కాజల్ జంటగా తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ నేనే రాజు – నేనే మంత్రి కూడా తెరకెక్కనుంది.
ఇక మాస్ చిత్రాల స్పెషలిస్టు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన జయజానకీ నాయిక సినిమా కూడా అదే రోజు రిలీజ్ కావాల్సి ఉన్నా ఒక రోజు ముందుకు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అంటే రెండు రోజుల తేడాలో మూడు భారీ క్రేజ్ ఉన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఇక ఆగస్టు 18న తాప్సీ నటించిన ఆనందో బ్రహ్మ, సునీల్ హీరోగా క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ఉంగరాల రాంబాబు విడుదల అవుతున్నాయి. ఆగస్ట్ 24న నాగ చైతన్య నటించిన యుద్ధం శరణం, అజిత్ డబ్బింగ్ మూవీ వివేగం కూడా రిలీజ్ చేస్తున్నారు.
ఆగస్ట్ 25న విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి.. అల్లరి నరేష్ మూవీ మేడ మీద అబ్బాయి విడుదల అవుతున్నాయి. మొత్తం ఆగస్ట్ నెల అంతా కొత్త సినిమాలతో టాలీవుడ్ కళకళలాడిపోనుంది.