షాకింగ్ ట్విస్టుల‌తో ‘ నేనే రాజు…నేనే మంత్రి ‘

విభిన్న చిత్రాలను తెరకెక్కించడంలో ద‌ర్శ‌కుడు తేజాకు మంచి టాలెంట్ ఉంది. తన చిత్రాలలో నటించే నటీమణులకు పాత్రలతో మంచి గుర్తింపు వచ్చేలా చేయడం… ఆ పాత్రలకి ప్రాణం పోయడం తేజాకి ఉన్న టాలెంట్. చాలా కాలం గ్యాప్ తరువాత తేజ పొలిటికల్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో ఓ సినిమా తెర‌కెక్కించాడు. బాహుబ‌లి సినిమాలో భ‌ళ్లాల‌దేవుడి పాత్రలో ఒదిగిన రానా ఈ సినిమాలో హీరోగా న‌టిస్తున్నాడు.

ఇందులో రానా కరడుగట్టిన రాజకీయ నాయకుడిగా, అధికారం కోసం ఎంతకైనా తెగించే వాడిగా కాస్త కొత్తగా కనిపించబోతున్నాడు. రానాతో మొదటి సారి కాజల్ జోడీ క‌డుతోంది. ఈ సినిమాపై తేజ మాట్లాడుతూ తమిళనాడు రాజకీయాల నేపథ్యం ఈ సినిమాలో క‌నిపిస్తుంద‌ని చెప్పి సినిమాపై ఎక్క‌డా లేని హైప్ పెంచేశాడు. ఆగ‌స్టు 11న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న ఈ సినిమా స్టోరీ లీక్ అయ్యింద‌న్న టాక్ కూడా ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.

సినిమాలో రానాతో పాటు నవదీప్ మరో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. షాక్ ఏంటంటే సినిమాలో రానా, కాజల్, నవదీప్ మూడు పాత్ర‌లు చనిపోతాయట. రానా పాత్ర దుర్మార్గంగా మారడానికి కారణం ప్రత్యర్థులు పన్నిన రాజకీయ కుట్రలో కాజల్ బలికావడమేనట. మరి నవదీప్ పాత్ర ఏంటి ? అతడికి రానాకు ఉన్న సంబంధం ఏంటి ? అన్న‌ది వెండితెరపై చూడాల్సిందే.

ఈ సినిమాలో రానా ఎలా చ‌నిపోతాడు ? అన్న‌ది పెద్ద ట్విస్ట్ అట‌. ఇక నేనే రాజు …నేనే మంత్రి సినిమా రానాకు, తేజ కెరీర్‌కు మంచి బ్రేక్ ఇస్తుంద‌న్న టాక్‌ ఇప్ప‌టికే వ‌చ్చేసింది. మ‌రి సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే ఆగ‌స్టు 11 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.